'వేయి పడగలు' నవల చదివిన ముళ్ళపూడి వెంకట రమణ గారు, విశ్వనాథ గారి శైలిలో ఒక ప్రేమలేఖ రాసారు.... అదెప్పుడో చదివిన గుర్తు. అలాగే జగన్నాథ్ గారు ప్రేమ లేఖ రాస్తే ఎలా ఉంటుందో, చదవండి .
అహో లలనామణి,
త్వదీయ వదనారవిందము ఉదయార్క భాను
బింబము వలె, మదీయ మానసమును ఆనంద డోలికల్లో తెలియాడిన్చుచూ, రంజింప
చెయుచున్నది. ఏమి ఆ మేని సౌకుమార్యము , మెత్తని పారిజాత కుసుమ దళాలను
తలపింప చెయుచున్నది. ఏమి ఆ సుందర దరహాసము... ఎదుట వన్నెచిన్నెల హరివిల్లు
విరిసినట్టుల ఉన్నది. ఆ నడక లోని హొయలు గజ గమనమును పొలుచున్నది. తమ
ముఖకమలము పై కురులు జాలువారుతున్న, కమలము చుట్టూ భ్రమించు భ్రుంగమును
చూచినటుల ఉన్నది. ఆ మృదు పల్లవ పదములకు ఒక మంజీరమునయినా కాకపోయితినే ....
నా దుర్భాగ్యమును యేమని చెప్పెద .
ఓ పువ్వుబొణీ , తమ మానస సరోవరమున ఒక హంసనై
విహరించవలెనని , నా మానసము ఉవ్విళ్ళూరు చున్నది. నా భవసాగర జీవనయాత్ర
అనే, నావకు తామే చుక్కానియై నడిపించమని మనవి చేయుచున్నాను. మదీయ మనః
స్థితిని సవివరముగా విన్నవించుకొంటిని . నాథుడిగా అంగీకరించేదరో, అనాధునిగా
చేసి త్రుణీకరించేదరో, ఇకపై తమ దయ. సర్వం జగన్నథమ్.
ఇట్లు
భవదీయ విధేయుడు,
మాన్ రోబో సస్పెన్స్ థ్రిల్లర్ రచయత, కవితా రత్న, జగన్నాథ్ .
ఇది,
ఈ తరం అమ్మాయికి ఇస్తే, బదులు ఇలా ఉంటుంది .... డ్యూడ్, నాకు ' మానస
సరోవరం, యాత్ర,' తప్ప ఏమి అర్ధం కాలెదు. నువ్వేదో మానస సరోవర యాత్రకు
వెళ్ళడానికి హెల్ప్ చెయ్యమని అడిగినట్టు మాత్రం తెలిసింది . కింద ఏజెంట్
నంబెర్ ఇస్తున్నా... హ్యాపీ జర్నీ .
No comments:
Post a Comment