Monday, September 2, 2013

కాశీరామేశ్వర మజిలీ కధలు

కాశీరామేశ్వర మజిలీ కధలు 
----------------------------------

పవిత్ర భారతావనిలో ఎన్నో పున్యనడులూ, పుణ్యక్షేత్రాలూ ఉన్నాయి. 

ఉత్తర భారత దేశంలో కాశీ విశాలాక్షీ సామెత విశ్వనాథ స్వామి ఉన్నారు. దక్షిణ భరత దేశంలో శ్రీరాముడిచే ప్రతిష్టించబడిన రామలింగేశ్వర స్వామి ఉన్నారు. 

పూర్వకాలంలో మునులు, మహాభక్తులు వారి కుటుంబాలతో సహా కాశీ నుండీ రామేశ్వరానికి, రామేశ్వరం నుండీ కాశీకి ప్రయాణం చేసేవారు. వీటినే కాశీరామేశ్వర యాత్రలు అంటారు. రవాణా సౌకర్యాలు , సరియిన మార్గాలు లేని ఆ రోజుల్లో, ఒకదానికి ఒకటి మరీ దూరం కనుక, దారిలో యాత్రికులు మజిలీలు చేసేవారు. అటువంటి మజిలీలలో ఆయా పుణ్య క్షేత్రాల విశిష్టతలను గురించిన కధలు చెప్పుకునేవారు. వాటినే 'కాశీ రామేశ్వర మజిలీ కధలు " అంటున్నాము. అవే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాము. ఈ కధల్లో, కాశీ నుంచీ రామేశ్వరం వరకూ కల అనేక పుణ్య క్షేత్రాల విశిష్టతలు తెలియచేయ్యబడతాయి. 

చాలా కాలం క్రితం, కాశీ నగరంలో సదానందయోగి అనే మునీశ్వరుడు ఉండేవారు. ఆయన అన్ని క్షేత్రాలు తిరిగారు. ఆయనకు ఎటువంటి తాపత్రయాలు, చీకూచింతలూ లేవు. ఆయన జ్ఞాని, ఆయనలో ఎప్పుడూ ఏదో ఆనందం, నిండుదనం కనిపిస్తాయి. అందుకే ఆయనను సదానంద యోగి అనేవారు. 

ఒకరోజు ఆయన తన శిష్యుడయిన చిదానందయోగిని పిలిచి, 'నాయనా! నాకు కాశీరామేశ్వర యాత్ర చెయ్యాలన్న సంకల్పం కలిగింది. నీవు, నీ తోటి విద్యార్ధులు నాతొ రండి. నేను మీకు కాశీ నుండీ రామేశ్వరం వరకూ కల నదులు, తీర్దాలు, వనాలు, పుణ్య క్షేత్రాలు మొదలయిన వాటి విశేషాలను చెప్తాను,' అన్నారు.

అదే మహాభాగ్యమని, నమస్కరించి, చిదానందుడు తోటి శిష్యులను పిలిచి కూర్చోపెట్టాడు. అప్పుడు సదానంద యోగి ఇలా చెప్పసాగారు....

సదానందయోగి, తన చుట్టూ ఉన్న శిష్యులను ప్రసన్నంగా చూసి, "నాయనలారా! ముందు మీరు మనం ఉన్న ఈ కాశీనగర వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ వారణాసి లోని ప్రతీ క్షేత్రమూ, ప్రతీ దైవము గురించి పూర్తిగా చెప్పాలంటే, బ్రహ్మకయినా సాధ్యం కాదు. ఇక నేనెంత? అలాగని మనిషి నిరుత్సాహపడరాదు, అందుకే నేను పెద్దలవల్ల విన్నది సమగ్రంగా చెబుతాను, వినండి," అంటూ ఇలా చెప్పసాగారు.

కాశీ నగరానికి మరొక పేరు శివ రాజధాని. ఇది గంగా నదికి పడమరగా, వక్రము కలిగి, ఐదు క్రోసుల దూరాన విస్తరించి ఉన్న మహా పట్టణము. ఈ నదీ తీరము పొడవునా, అరవై నాలుగు పెద్ద తీర్ధములు ఉన్నాయి. 

పూర్వం దక్షప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేసాడు. ఒకసారి దక్షయజ్ఞం సమయంలో దక్షుడు శివుడి మీద అక్కసుతో, సతీదేవిని పరాభవించాడు. ఆమె యోగాగ్నిలో పడి, ప్రాణాలు విడిచింది. ఆమె ప్రేతాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్న శివుడిని, తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు, విష్ణువు తన యోగమాయతో ఆ దేహాన్ని పద్దేనిమిది ముక్కలు చేసాడు. అప్పుడు ఆ దేవి ముఖం ఈ కాశీలో పడినందువల్ల, ఈ ప్రదేశానికి " గౌరిముఖ " అనే పేరు వచ్చింది. ఇక్కడి దేవత పేరు, కాశీ విశాలాక్షి. 

ఈ మహాకాశీ క్షేత్రానికి రాజు విశ్వనాధుడు . మంత్రి బిందుమాధవ స్వామి. క్షేత్రపాలకుడు భైరవుడు. గణనాయకుడు లేఖాదారుడు. ఇక్కడ లేని దేవతలు, తీర్ధములు, మహిమలు మరి వేరెందునూ లేవని పురాణాలు చాటి చెబుతున్నాయి. ప్రళయంలో కూడా నశించని, శివుడి త్రిశూలాగ్రంపై స్థితమై ఉన్న ఈ పట్టణమే కాశీ. 

ఇక ఈ క్షేత్ర యాత్రా విధానం చెబుతాను, వినండి....

కాశీ యాత్రా విధానం గురించి చెప్పసాగారు సదానందయోగి.

ఈ కాశీ యాత్రకు వెళ్ళినవారు ఉదయాన్నే మేల్కొని, స్నానాదులు ముగించుకుని, ముందుగా అన్నపూర్ణా విశ్వేస్వరులను దర్శించుకోవాలి.

తరువాత బిందుమాధవ స్వామిని సేవించి, విశ్వేశ్వర మందిరం వద్ద ఉన్న డుండిం రాజ గణపతిని ఆరాధించి, తరువాత ఉత్తరంగా ఉన్న దండపాణి స్వామిని పూజించి, కాలభైరవుడిని దర్శించి, పడమరన ఉన్న కాశీ మూర్తిని సేవించి, వాయువ్యంగా ఉన్న గుహను చూచి, గంగా పుష్కరిణిని కొలిచి, విశ్వేశ్వరం లోని అన్నపూర్నాదేవిని పూజించి, మణికర్నికకు పోయి, మణికర్ణికా మూర్తిని ఆరాధించి, అక్కడే స్నానం చేసి, తిరిగి విశ్వేశ్వర సన్నిధికి వచ్చి నమస్కరించి, వసతికి వెళ్ళాలి . దీనినే నిత్య యాత్రా విధానం అంటారు. ఇక మనం బయలుదేరి, గయా గదాధరకు వెళ్దాము , అంటూ శిష్యులతో యాత్రకు బయలుదేరారు సదానంద యోగి. 

అలా గయా గదాధర క్షేత్రం చేరి, మొదటి మజిలీ చేసారు. అక్కడ సదానందయోగి శిష్యులకు గయా క్షేత్ర ప్రాశస్త్యాన్ని గురించి ఇలా చెప్పసాగారు.

"త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేయ వెళుతూ ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ఒకనాడు సీతాదేవి ఏమీ తోచక, ఇసుకతో ముద్దలు చేసి పెట్టింది. ఈ క్షేత్ర ప్రభావం వల్ల ఆ ఇసుక ముద్దలు పితృదేవతలకు సంక్రమించాయి. శ్రీరాముడు ఒకసారి పితృదేవతలకు తర్పణాలు విడిచి, పిండ ప్రదానం చెయ్యగా దాశరధ మహారాజు ఈ ఇసుక ముద్దలో కనిపించాడు. రాముడి మనసు చాలా బాధపడింది. ఈ పని చేసినది ఎవరని రాముడు అడుగగా, అక్కడి ఫల్గుణీ తీర్ధము జరిగింది చెప్పింది. రాముడు అంత తన పితృదేవతలను , దాతలను క్షమాపణ కోరి, మరలా పిండములను ఇవ్వగా పితృదేవతలు అంగీకరించారు. తన పొరపాటును రాముడికి చెప్పినందుకు, సీతాదేవి ఫల్గుణి తీర్ధంపై కోపించి,' ప్రజల కంటికి కనబడకుండా ప్రవహించు, ' అని శపించింది. అందుకే దీనిని 'అంతర్వాహిని' అంటారు.

"గయలోని ఒక పెద్ద మందిరంలో చదరమయిన కుండములో మూర పొడుగున్న నున్నటి పాదం ఒకటి ఉంటుంది. ఇది గయుడి తలపై ఉంచిన శ్రీమహావిష్ణువు కుడి పాడమని చెప్పబడుతోంది. దీని మీద పిండము పడనీ రోజే ఉండదు. అలాగే ఈ క్షేత్రంలో శివపాదం, కుమారస్వామి పాదం, బ్రహ్మ పాదం, సూర్య పాదం, చంద్ర పాదం, ఇంద్ర పాదం, క్రౌంచ పాదం, గణపతి పాదం, మతంగ పాదం, అగస్త్య పాదం, కశ్య పాదం, త్రేతాగ్ని పాదం అనేవి కూడా ఉన్నాయి.

విష్ణు పాదానికి ఈశాన్యంగా గదాధర స్వామి విగ్రహం ఉంది. దానికి పడమరగా రాతి గద  ఉంది. అందుకే ఈ క్షేత్రానికి గయాగదాధర క్షేత్రం అని పేరు వచ్చింది." అంటూ ముగించారు సదానంద యోగి.

మర్నాడు శిష్య సమేతంగా ప్రయాణం సాగించి, ప్రయాగలో రెండవ మజిలీ చేసాడు.

" నాయనలారా! ఈ ప్రయాగ అలహాబాదుకు తూర్పుగా ఉంది. దీనికి పడమరన గంగా నడి ప్రవహిస్తోంది. దీనినే ధారాగంజ లేక ధారానగరం అని అంటారు. భోజ రాజు పాలించిన నగరం ఇది. ఇక్కడ గంగాపుత్రులు అనే ఒక జాతి వారు ఉన్నారు. వారు ఇచ్చటికి వచ్చినవారికి అనేక ప్రదేశములు చూపి, యాత్రికుల నుండీ ధనం సంపాదిస్తారు. 

గంగ యమున సరస్వతి అనే మూడు నదులు కలిసిన త్రివేణి ఇక్కడ ప్రవహిస్తోంది. ఇక్కడ రెండు నిలువుల ఎట్టు కొట్టివేయ బడ్డ ఒక మఱ్ఱి చెట్టు ఉంది. దాన్ని 'అక్షయ వట వృక్షమని 'అంటారు. మునుపు ఈ అక్షయ వటవృక్షం కొమ్మలు నదిలోకి వంగి ఉండేవట. ఎవరయినా ఈ చెట్టు కొమ్మల మీదికి ఎక్కి, వాళ్ళ కోరికలు చెప్పి, నదిలోకి దుమికి చనిపోయిన, వారు మరుజన్మలో వారి కోరికలను పొందుతారని చెబుతుంటారు. అందుకు భోజ రాజు కధే నిదర్శనము.

ప్రయాగ క్షేత్ర విశిష్టత గురించి చెబుతూ భోజ రాజు కధను ఇలా చెప్పసాగారు సదానందయోగి.

ఒకసమయంలో ముగ్గురు కన్యలు అక్షయ వట వృక్షం మీదకు ఎక్కి, నదిలో దూకబోతూ, ఒకామె  మహాపండితుడు తనకు భర్త కావాలి అని, ఇంకొకామె ధీరుడయిన పతి  కావాలని, మూడవ స్త్రీ గొప్ప కీర్తి కల రాజు తనకు భర్త కావాలని కోరుకుని, ప్రవాహంలో దూకేసారు. ఇదంతా చూసిన ఒక మంగలి, ఆ ముగ్గురూ తనకు భార్యలు కావాలని కోరుకుని, నీటబడి మరణించాడు. అతడే మరు జన్మలో భోజ రాజుగా పుట్టి, ఆ ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకున్నాడని, గ్రంధాలు చెబుతున్నాయి. 

ఇదొక గొప్ప యాత్రా స్థలం, ఇక్కడ కొంత దూరంలో భరద్వాజ ఆశ్రమం ఉంది. రాముడు రావణ వధ తరువాత ఈ ముని ఆశ్రమానికి వచ్చినట్లు చెప్పబడుతోంది. ఇక్కడి గంగా పుత్రులు తేలుతూ ఉన్న బల్లల మీద త్రివేణీ పూజ, ముత్తైదువల చేత వేణీ సమర్పణ పూజలు చేయిస్తారు. భాగీరధి లో యమునా, అంతర్వాహిని అయిన సరస్వతి నదులు కలియుచుండుట చేత ఇది త్రివేణీ సంగమం అయ్యింది,' అంటూ ప్రయాగ క్షేత్ర మహత్యాన్ని వివరించారు సదానందయోగి.

మర్నాడు వారంతా యాత్రను కొనసాగించి, అయోధ్యా పురం చేరుకున్నారు. 

" నాయనలారా! మనమిప్పుడు వచ్చిన ఈ అయోధ్యా పురం పూర్వం శ్రీరామచంద్రునిచే పాలింపబడిన పుణ్య భూమి. ఒకప్పుడు అయోధ్యా పురం సరయూ నదిలో కలిసిపోయినట్లు చరిత్ర చెబుతోంది. అయినా ఆ నాటి కట్టడాలు చెక్కు చెదరలేదు.

 సాక్షాత్తు విష్ణు భగవానుడి అవతారంగా చెప్పబడ్తున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం... గాలి పవిత్రం... పరిసరాలు పవిత్రం... అందుకే అయోధ్యను సప్తమోక్ష పురాలలో ఒకటిగా మన పురాణాలు చెప్పాయి.ఎందరెందరోమహనీయులకు జన్మనిచ్చిన అయోధ్య ‘పూర్వనామం’సాకేత. కోసల దేశ రాజధానిగా ప్రసిద్ధిగాంచిన ఈ నగరం ఎందరెందరో ఇక్ష్వాకుల రాజులకు పుట్టిల్లుగాపరిఢవిల్లింది.  శ్రీరాముని తాతలలో ఒకరైన‘అయుధ’ అయోధ్య క్షేత్రాన్ని పాలించాడు. ఆ కారణంగా ఆయన తదనంతర కాలంలో ఈ క్షేత్రానికి అయోధ్య అనే పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. ‘యుధ్’ అంటే సంస్కృతంలో యుద్ధమని, నాశనమని అర్థం. అ‘యుధ్’అంటే నాశనం కానిదని అర్థంగా చెబుతారు. కనుకకాశీనగరం ఎలా అయితే నాశనం లేని నగరంగా పురాణాలలో పేరుప్రఖ్యాతులుగా సాధించిందో అలాగే అయోధ్య నగరం కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులలోనూ నాశనం చెందని నగరంగాప్రసిద్ధిగాంచింది.సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి జన్మనిచ్చిన పుణ్యప్రదేశంగా ఖ్యాతికెక్కిన ‘అయోధ్య’ గాగ్రనది ఒడ్డున అలరారుతోంది. సరయూ నదిగా పేరుప్రఖ్యాతులు పొందిన ఈ నదిలోనే శ్రీరాముడు, అవతార సమాప్తిని చాలించాడని స్కంద పురాణం ద్వారా అవగతమవుతోంది. సదా శ్రీరామ నామస్మరణంతో మారుమ్రోగే అయోధ్య నగరం విశాలమైన అందమైన ఆలయాలకు వేదికగా ఉంది. ఈ క్షేత్రంలో వందకు పైగా ఆలయాలున్నాయి. సూర్యవంశస్థులైన ఇక్ష్వాకుల రాజులెందరో పాలించిన ఈ నగరంలోనే 63వ రాజుగా పట్ట్భాషిక్తుడైన శ్రీరామచంద్రుడు ధర్మస్థాపన చేసి,విశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించాడు. రాముడి తండ్రి దశరథ మహారాజు అయోధ్యలో పుత్రకామేష్టీ యాగాన్ని నిర్వహించాడు. అలాగే హరిశ్చంద్రుడు,రాజసాగరుడు, భగీధుడు విక్రమాదిత్యుడు గౌతమ బుద్ధుని పాదస్పర్శతో అయోధ్య నగరం పరమ పుణ్యప్రదమైన నగరంగా రూపుదిద్దుకుంది.  సాక్షాత్తు శ్రీరాముని పాద స్పర్శతో పునీతమైన ‘అయోధ్య’ నగర సందర్శనం, స్మరణం సర్వపాపాలను హరిస్తుందట. 
ఈ నగరాన్ని సాక్షాత్తు దేవతలే నిర్మించారని, అందుకే ఇది భూతల స్వర్గమయిందని అధర్వణ వేదం చెబుతోంది. మోక్ష ధ్యానపురిగా మన పురాణాలలో ప్రఖ్యాతి చెందిన అయోధ్యా నగరం ఎన్నో మహిమాన్విత ఆలయాలకు నెలవు. అయోధ్యలో కాలుమోపిన భక్తులంతా ముందుగా ఇక్కడ సరయూ నదిలో స్నానాదికాలు చేయడం సంప్రదాయం. ‘స్వర్గ్‌ద్వార్’గా కీర్తికెక్కిన ఇక్కడే యాత్రికులు పిండ ప్రదానాలు చేస్తారు. సాక్షాత్తు శ్రీరాముడు అవతార సమాప్తిని చాలించినపుణ్యప్రదేశంగా ఇది ఖ్యాతికెక్కింది. సరయూ నది ఒడ్డునే లక్ష్మణ మందిరం ఉంది. ఇక్కడ లక్ష్మణుడు కొలువుదీరాడు. దీనికి సమీపంలోనే నాగేశ్వరనాథ్ మందిరం ఉంది. శ్రీరాముని కుమారుడు ‘కుశుడు’నిర్మించిన ఆలయంగా ఇది ఖ్యాతికెక్కింది. విక్రమాదిత్య కాలంనుంచీ చరిత్రకు నిదర్శనంగా మిగిలిన ఆలయం ఇదొక్కటేగా దీనిని చెబుతారు. మిగిలిన ఆలయాలన్నీ ముస్లింల దాడులకు అంతరించిపోయినవే. నాగేశ్వరనాధ్ మందిరానికి సమీపంలో కాలేరామ్ మందిరం ఉంది. సరయూ నదిలో దొరికిన నల్లని సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రునివిగ్రహాలు ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్టించారు. ఇక్కడకు సమీపంలోనే ‘హనుమాన్ ఘడి’ ఉంది.ఇక్కడ నవాబు షాజుద్దౌలా నిర్మించిన రామచంద్రాలయం ఉంది. అయోధ్య నగరం నడిబొడ్డున ఉన్న ఈ మందిరానికి చేరుకోవడానికి 76మెట్లున్నాయి. హనుమంతుడు ఇక్కడో గుహలో ఉండిరామజన్మభూమిని రక్షించేవాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ అంజనీమాత ఒడిలో బాల ఆంజనేయుని మూర్తి దర్శనం భక్తులకు భక్తిపారవశ్యంలో ముంచెత్తుతుంది. దీనికి సమీపంలో‘కనక భవన్’ ఉంది. కైకేయి మాత సీతామహాసాధ్వికి బహుమతిగా ఇచ్చిన పుణ్యస్థలం ‘కనక భవన్’,బంగారు సింహాసనం ఉన్న ఈ భవనమే శ్రీరామచంద్రుని నివాస స్థలంగా చెబుతారు. బంగారు కిరీటాలు ధరించి రామలక్ష్మణ సీత విగ్రహాలు ఈ మందిరంలో దర్శనమిస్తాయి. ఈ విశాలమైన ఈ ఆలయ ప్రాంగణం నిత్యం భక్తజన సందోహంతో అలరారుతుంది. సదా శ్రీరామనామ స్మరణంతో ఇక్కడి పరిసరాలు మారుమ్రోగుతాయి. అయోధ్య నగరంలోనే మరోచోట చోటిదేవ్‌కాళీ మందిరం ఉంది. వీటితోపాటు శ్రీరామ జానకి బిర్లా ఆలయం, తులసి స్మారక భవన్,రామ్‌కిపౌరి, దతువన్‌కుండ్, జానకి మహల్,బ్రహ్మకుండ్, లక్ష్మణ్‌కిా, రామ్‌కధా మ్యూజియం,వాల్మీకి రామాయణ మ్యూజియం, సుందర సదన్,హరిహర మందిరం, తులసీదాసు మందిరం, క్షీరేశ్వరుని మందిరాలున్నాయి. ఇవన్నీ చూడదగినవి. అయోధ్యలో అత్యంత పుణ్యప్రదేశం రామజన్మభూమి ప్రాంతం. మన పురాణాలలో విశిష్టమైన పవిత్ర క్షేత్రంగా ఖ్యాతికెక్కినఅయోధ్య నగరం సప్తమోక్ష పురాణాలలో ఒకటి. ముక్తిక్షేత్రంగా, స్వర్గ్ధామ్‌గా పేర్గాంచిన ఈ నగరంలోకి అడుగిడినంత మాత్రానే సమస్త పాపాలు పోతాయని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది. 


ప్రస్తుతం ఈ సరయూ నదీ తీరంలో రామఘాట్, భారతఘాట్, లక్ష్మణ ఘాట్, శత్రుఘ్న ఘాట్, స్వర్గద్వార ఘాట్, వాల్మీకి ఘాట్, మొదలయినవి ఎన్నో ఉన్నాయి. అంటూ, రామాయణ కధను సమగ్రంగా వివరించి, మరునాడు యాత్ర కొనసాగించి మధురలో మజిలీ చేసారు గురుశిష్య గణం.. 

మధురా నగరాన్ని గురించి ఇంకా ఇలా చెప్పసాగారు సదానందయోగి....
 ‘మధుర’ని కృష్ణ జన్మభూమి అని కూడా పిలుస్తారు. దుష్ట శిక్షణార్థం ద్వాపర యుగంలో వసుదేవుని భార్య దేవకీదేవి అష్టమ గర్భంలో మధురలో జన్మించాడు శ్రీకృష్ణుడు. ఆ రకంగా శ్రీ మహావిష్ణువు యదునందన రూపాన్ని ధరించి దైత్యరాజు కంసుని వధించటమే కాదు కౌరవవంశ వినాశనానికి రథ చోదకుడయ్యాడు.
ఇక్కడి ‘కట్రా మందిర’ స్థానానే్న కృష్ణ జన్మస్థలిగా వ్యవహరించటం జరుగుతోంది. స్థానిక గీతామందిరంలోనూ భగవద్గీతా మంటపంలోనూ శ్రీ కృష్ణ జనన వివర చిత్రావళి మనకు దర్శనం ఇస్తుంది. యమునా తీరంలోని రాధా మాధవ మందిరం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మందిరంలోని రాధాకృష్ణ చిత్రం భక్తులనెంతో పరవశింపచేస్తూ వుంటుంది. ఈ రాధా మాధవ మందిర సమీప నదీ తీరంలోని శ్యాంఘాట్, రాంఘాట్, సప్తర్షిఘాట్, మోక్ష తీర్థ, బుద్ధ తీర్థ ఘాట్ అన్ని మతాలవారి అవసరాల్ని తీర్చటమే కాకుండా మధురలోని అతి పవిత్ర తీర తీర్థస్థానాలుగా పరిగణించబడుతున్నాయి. ఇవి కాకుండా ఇక్కడి విష్ణుగుండాలనబడే ఓ నూటా అరవయ్ సరస్సులలో భక్తులు నిత్యమూ స్నానాలు చేస్తూ వుంటారు. కాని ప్రస్తుత నగర విస్తరణలో ఎన్నో సరస్సులు అంతరించిపోతున్నాయి. మధురలోని ఆ సరస్సుల సమాహారం వెనువెంటే సాగే యమునా తీరంలోని బృందావనం గురించి తెలియని భారతీయులు ఉండరు. ఈ బృందావనాన్ని తీర్చిదిద్దిన శ్రీకృష్ణుడు దాన్ని రాధకి తన కానుకగా అందజేసాడట. వారిరువురి రాసలీలలకి బృందావనమే బాటగా నిలిచింది.
ఎన్నో ఆశ్చర్యాలకు నిలయంగా ప్రసిద్ధి చెందినది మధురా నగరం. ఆ నగరంలో గోపాలకుల వంశంలో మణిదీపంలా పుట్టాడు శ్రీకృష్ణుడు. అతడు స్వచ్ఛమైన జలాలతో అలరారే యమునా నదీ తీరంలో విహరిస్తాడు. యశోదాదేవికి ఆనందాన్ని కలిగిస్తాడు. వెన్నెలను దొంగలిస్తూ, తల్లిచే బంధింపబడతాడు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి మనం నిత్య కర్మానుష్ఠానాలతోనూ, రమణీయ కుసుమాలతోనూ పూజిం చాలి. నోరారా స్తోత్ర పాఠాలను చదువుతూ భక్తితో ధ్యానిం చాలి. అలా చేస్తే పూర్వం చేసిన పాపాలూ, రాబోయే రోజుల్లో చేసే పాపాలూ అన్నీ అగ్నిలో పడవేసిన దూది పింజలవలె వెంటనే కాలి బూడిదై పోతాయి. 


సదానంద యోగి మధురా క్షేత్ర వైశిష్ట్యాన్ని గురించి ఇంకా ఇలా చెప్పసాగారు. 

యమునా నడి ఒడ్డున ఉన్న ఈ సుందర నగరంలో గోకులము, బృందావనము, వేనువనము, కుమారవనము, దాళ వనము, గోవర్ధానము, మానస సరస్సు అనే పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ పేరొందిన ఘట్టాలలో విశ్రమ ఘట్టం లో కంసుడిని చంపాకా శ్రీకృష్ణుడు విశ్రాంతికై శయనించాడు అని చెబుతారు. దీనికి చేరువలో ఉన్న మందిరంలో శ్రీకృష్ణపాదాలు అనే శిలలు అనేకం ఉన్నాయి. యాత్రికులు స్నానం చేసాకా ఈ కృష్ణ పాదాలను అభిషేకిస్తారు.

మధురలోని దేవాలయాల్లో ద్వారకానాధ మందిరం గొప్పది. ఆలయ మండపం అతి సుందరంగా ఉంటుంది. గడచినా యుగాలలో మునులె కాక, ముక్కోటి దేవతలు జపతపో నియమాలతో నివసించిన అనేక  ఆశ్రమాలు మనకు ఇప్పటికీ కనిపిస్తాయి. 

మధురకు నైరుతి భాగంలో భూతేశ్వర లింగం అనే తెల్లని లింగం ఉంది. కృత, త్రేతా, ద్వాపర యుగాలలో అనేక దేవమునీంద్రులచే ఆరాధించబడింది ఈ లింగం. ఆ స్వామి దేవేరి పేరు పాతాళ సిద్దేశ్వరి. 

అక్కడికి కొంత దూరంలో శ్రీకృష్ణ జన్మ స్థానం ఉంది. కంసుడు దేవకీవసుదేవులను బంధించిన చెరసాల , శ్రీకృష్ణ జననం జరిగిన ప్రదేశం కూడా ఇదే ! 

ఇలా మధుర యాత్ర ముగించి, గురుశిష్యులంతా మర్నాడు గోకుల క్షేత్రం చేరుకున్నారు.


గోకుల క్షేత్ర మజిలీ 

"మధురకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ‘గోకులం’ ఉంది. శ్రీకృష్ణుడు గోప బాలురతో క్రీడించిన స్థలంగా దీనిని చెబుతారు. ఇక్కడే బాలుడైన శ్రీకృష్ణుడు తనను
చంపవచ్చిన పూతన అనే రాక్షసిని సంహరించిన చోటుగా "గోవింద కుండం" ను చెబుతారు. గోకులంలో రాధాకృష్ణ, బలరామ మందిరాలున్నాయి.  మధురా ,బృందావనం ,గోకులం లను మూడింటిని కలిపి ‘’వ్రజ భూమి ‘’అని పిలుస్తారు ఇక్కడ లెక్కకు మించిన తీర్దాలు ఉన్నాయి. 

కంసుడు చంపుతాడన్న భయంతో తండ్రి వసుదేవుడు అతణ్ణి గోకులాన్ని తరలించాడు. అక్కడ ఆయన యశోదా దేవి దగ్గర పెరిగాడు.. 
గోకులంలో కృష్ణుడు ఉన్నది ౩ సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే. ఈ లోగానే ఆయనపై పలు మార్లు హత్యాయత్నం జరిగింది. కంసుడు పంపిన పూతన, శకటాసురుడు లాంటి వాళ్లు జగద్గురువును మట్టుపెట్టే వెర్రి యత్నం చేశారు. ఈ ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. 

వసుదేవుడు వ్రేపల్లెలో ప్రవేశించిన చోటును "నందకవాటం" అని అంటారు. గోవింద కుండంలో యాత్రికులు స్నానాదికాలు చేసిన తరువాత, పురాతన గోకులం చేరుకుంటారు. ఇదే యశోదమ్మ చల్ల చిలికిన చోటని చెబుతారు.

గోకులంలో నాటి శ్రీకృష్ణ లీలలకు సంబంధించిన దృశ్యములు అన్నీ చక్కని ప్రతిమలుగా మలిచారు. అనేక దేవాలయములు, క్షేత్రములు కల ఈ భూమి అతి పవిత్రమయినది", అని చెప్పి, సదానందయోగి మరునాడు శిష్యులతో బృందావనం చేరుకున్నారు.
బృందావన క్షేత్ర మజిలీ 

సదానందయోగి తన శిష్యులకు బృందావనం గురించి ఇలా చెప్పసాగారు. 
"మనం ఇప్పుడు మజిలీ చేసిన బృందావనం అనేది కృష్ణుడు యమునా నది ఒడ్డున తన బాల్యం గడిపిన ప్రదేశము. ఈ బృందావనంలో కృష్ణుడు రాధ మీద ఉన్న ప్రేమను దివ్య నృత్యంతో చేసిన రాసలీలల ద్వారా చెప్పెను. గోపికలు స్నానము చేస్తుంటే వారి బట్టలు దొంగిలించేను. అంతే కాకుండా అనేక రాక్షసులను నాశనం చేసెను. బృందావనం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రము మరియు దాని గొప్పతనాన్ని చాటిచెప్పే 5000 దేవాలయాలు ఇక్కడ ఉండటము గొప్ప ఆశ్చర్యమునకు గురి చేస్తుంది.
క్తి ఎక్కడ ఉంటుందో రాధమ్మ అక్కడ ఉంటుంది. బృందావనంలో ఎక్కడ చూసినా రాధే... రాధే....రాధే.... ఏ గోడమీద చూసినా "రాధే....రాధే.... ఏ వాహనం వెనుక చూసినా రాధే....రాధే.... ఎవరు పలకరించినా రాధే....రాధే.... బృందావనవాసులకు అలవాటైనది ఒక్కటే రాధే....రాధే.... కృష్ణుని ప్రేమ రాధ.. బాంకీ బిహారీ ఆలయంలో మూర్తి రాధాకృష్ణుల ఏక స్వరూపం.
 నిధువన్ లో ఇప్పటికి రాసలీల జరుగుతూ ఉంటుందట. రాత్రి ఎనిమిది తర్వాత ఆ వనం తలుపులు మూసివేస్తారు. ఈ లోగా అక్కడ రాధాకృష్ణుల శయనమందిరాన్ని భక్తి నిండిన హృదయాలతో చక్కగా అలంకరిస్తారు.సుగంధాలీనే పన్నీరు అత్తరులతో పరిమళింపజేస్తారు. చక్కటి మిఠాయిలు పళ్ళెరాలలో ఉంచుతారు. ఆ చుట్టూ ఉన్న భవనాలలోని కిటికీలు ఎనిమిది తరవాత మూసి మరునాటి ఉదయంవరకు తెరవరు... మరునాటి ఉదయం నాలుగున్నరకు భక్తులతో సహా అందరూ వచ్చి చీపుళ్ళతో ఆ తోటంతా శుభ్రపరుస్తారట.. మిఠాయిలు ఎవరో తిన్నట్టు, పక్క నలిగినట్లు, భక్తులకు గోచరమవుతుందట. అక్కడ కృష్ణ సాన్నిధ్యంలో తిరిగిన గోపికల శరీరంనుండి జారిన ఆభరణాదులు కూడా చూసినవారున్నారట. మరొక వనం "సేవాకుంజ్".. ఆ లీలామానుషవిగ్రహుడు రాధమ్మకు అక్కడ సేవ చే్స్తాడట..అలాగే "వంశీ వట్", ఆ చెట్టుక్రింద మురళిగానం విన్నవారున్నారట.
 "బర్సానా" అనేది రాధమ్మ పెరిగిన చోటు చూసాం.. "నందగాఁవ్ - దాన్నే రమణ రేటీ"అంటారు. రమణ్ రేటీ అంటే రమణీయమైన మట్టి అని అర్థంచెప్పారు. అక్కడ కృష్ణుడు గోపబాలురతో కలసి ఆటలాడే వాడు, చల్దులు పంచేవాడు. ఆ అద్భుత భావంతో భక్తులు తన్మయులై ఆటలాడతారు, పాటలు పాడతారు, నృత్యం చేస్తారు.. మట్టిలో పొర్లుతారు . ఆబాల గోపాలం అక్కడ తమని మరచిన తమకంతో కేరింతలు కొడతారు. ఇక్కడి అణువణువూ కృష్ణుడి స్పర్శతో పునీతమయ్యింది.
బృందావన క్షేత్ర మజిలీ 

బృందావన క్షేత్ర ప్రాశస్త్యం గురించి ఇంకా ఇలా చెప్పసాగారు సదానందయోగి.

" ఇక్కడి చోరాఘాట్ లో కృష్ణుడు తుమ్మెదలతో ఆడిన చోటు భ్రమరఘట్టం అని పిలవబడుతుంది. హనుమంతుడు కృష్ణుడిని పూజించిన చోటు హనుమద్ఘట్టం అని చెబుతారు. గోపికలు స్నానం చేస్తుండగా కృష్ణుడు చీరలు అపహరించిన చోటు చేలా ఘట్టం అనీ, నంద బాలుడు గోపికలతో రాసక్రీడలు సలిపిన చోటు రాసక్రీడా ఘట్టం అనీ చెప్పబడుతోంది. నాడు కృష్ణుడు కాళీయుడి తల మీద తాండవం చేసిన చోటు కాళీయ ఘట్టమని చెబుతారు. ఆ ప్రదేశంలో నిలువెత్తు కాళీయుడి పుట్ట, యశోదానందుల, వేణుగోపాల విగ్రహాలు ఉన్నాయి. 

బృందావనం నుంచీ మధురకు వెళ్ళే దారిలో అక్రూర మందిరం, భైరవాలయం, వంటి దేవాలయాలు సేవాకుంజరం అనే పేరుతో  పవిత్ర స్థలం ఉన్నాయి. అక్కడ కృష్ణ పాదుకలను అమ్ముతారు." అంటూ చెప్పి, మరుసటి రోజున సదానందయోగి  శిష్యులతో కలిసి గోవర్ధనగిరిలో మజిలీ చేసారు.

" నాయనలారా! ఈ గోవర్ధనగిరి మధురా నగరానికి ఏడు క్రోసుల(21 km ) దూరంలో ఉంది. శ్రీకృష్ణుడు గోవులను కాస్తుండగా బ్రహ్మాది దేవతలు ఆయనను పరీక్షించ వచ్చిన స్థలం ఇది. ఇంద్రుడు కుండపోతగా వాన కురిపిస్తుండగా కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని కాపాడాడు. ఇప్పుడు ఈ కొండ వల్ల ఒక జలాశయం రెండుగా చీలి బ్రహ్మతీర్ధం అనీ , మానసగంగ అనీ పేరు పొందింది. ఈ గ్రామంలో ఉన్న సకలేశ్వర దేవుడు, మానసదేవి ప్రతిమలు, శ్రీకృష్ణ మూర్తులు విశేషమయినవి. " అని చెప్పి, సదానంద యోగి మర్నాడు శిష్యులతో ప్రయాణం సాగించి, పాటలీపుత్రంలో మజిలీ చేసారు.

పాటలీపుత్ర క్షేత్రాన్ని గురించి ఇలా చెప్పసాగారు సదానందయోగి.

"నాయనలారా! పూర్వమొకప్పుడు పాటలీ అను యువతీ, పుత్రుడు అనే యువకుడు కలిసి భార్యాభర్తలై ఈ నగరం నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. గంగానదికి దక్షిణంగా ఉన్న ఈ క్షేత్రంలో ఏకముఖ, ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖ, పంచముఖ శివలింగాలు అనేకం ప్రతిష్ట చెయ్యబడ్డాయి. ఎన్నో దేవాలయాలు, విశాలమైన పుర వీధులు ఇక్కడ ఉన్నాయి.

పాటలీపుత్రం యొక్క రాజధాని మొదటి పేరు కాలీకాతా. అంటే, కాళికాదేవి నివశించే చోటు అని అర్ధం. ఇక్కడ కాళికాదేవి పొడవైన నాలుకతో భయంకరంగా  దక్షిణ అభిముఖంగా ఉంటుంది. కాళి వేంచేసి ఉన్న ఈ ప్రాంతమే భువనేశ్వర స్థలం. ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయని ప్రతీతి. వీటిలో ప్రముఖమైనది భువనేశ్వర స్వామి లింగం. ఈ స్వామి స్వయంభువని కొంత మంది నమ్మకం. 
ఈ ఆలయం బహు శోభాయమానం. దేవాలయం చూట్టూ ఉన్న కోవెలలో అనేక విగ్రహాలు ఉన్నాయి. ఈ లింగాన్ని కులంతో సంబంధం లేకుండా ఎవరయినా అభిషేకించవచ్చు. 

బిందు సరసీ తీర్ధంలో అరుదయిన బ్రహ్మ దేవాలయం ఉంది. ఈ పాటలీపుత్రంలో ఉన్నవారంతా శ్రీమంతులు. ఇక్కడి భువనేశ్వర స్వామికి భోగములు నిరాటంకంగా జేరిగేందుకు మహారాష్ట్ర ప్రభువులు ఇచ్చిన గ్రామములూ, ఇతర ఆదాయములు పుష్కలంగా ఉన్నాయి," అని చెప్పి మర్నాడు ప్రయాణం సాగించి, శిష్యులతో పురుషోత్తమ క్షేత్రాన్ని చేరి మజిలీ చేసారు సదానందయోగి. 

పురుషోత్తమ క్షేత్ర మజిలీ

"నాయనలారా! ఈ పురుషోత్తమ క్షేత్రాన్నే జగన్నాధ క్షేత్రమని కూడా అంటారు. ఇది సముద్ర తీరానికి కొంత పైభాగంలో ఉంది. సుభద్రా బలభద్ర సామెత జగన్నాధ స్వామి ఆలయం నీలాచల గ్రామ మధ్యభాగంలో ఉంది. ఇక్కడ యాత్రికులు, సాధువులు, భక్తులు బస చేసేందుకు వీలుగా అనేక సత్రాలు నిర్మించబడ్డాయి.

గ్రామానికి తూర్పుగా ఇంద్రప్రద్యుమ్న మహారాజు నిర్మించిన అనేక మందిరాలు ఉన్నాయి. జగన్నాధ స్వామి రధ యాత్రకు వచ్చనప్పుడు  ఆ మందిరంలో నివసిస్తారు. స్వామీ ఆలయం అనేక శిల్పాలతో సర్వాంగ సుందరంగా ఉంటుంది. ఆలయానికి నైరుతి భాగంలో అక్షయ వట వృక్షం ఉంటుంది.

గర్భాలయం లోని వేదిక మీద ఎరుపు ముఖం కల సుభద్రాదేవి, కుడివైపు తల్లని ముఖం కల బలరాముడు, ఎడమవైపున నీలముఖం కల జగన్నాథ స్వామి దర్శనం ఇస్తున్నారు. ప్రతీ రోజూ ఇక్కడ యారవై రెండు వినియోగాలు ఇస్తున్నారు. స్వామికి నైవేద్యం ఇచ్చాకా, అదే మందిరంలో కాని,  అక్షయ వట వృక్షం క్రింద కాని, భక్తులు వరుసగా కూర్చుని, స్వామి ప్రసాదం అందుకుంటారు. అక్కడ కులమత భేదాలు ఉండవు. ఎంగిలి పట్టింపులు కూడా ఉండవు, అందుకే కాబోలు మన వారు సర్వం జగన్నాథం అంటారు. నారద సూత శౌనకాది మునులు ఈ జగన్నాథ క్షేత్ర మహత్యమును అనేక పురాణములలో కొనియాడి చెప్పినారు.

ఈ జగన్నాథ క్షేత్రం గురించిన ఇతిహాసం ఒకటి కలదు. 


పురుషోత్తమ క్షేత్ర మజిలీ - రోహిణీ కుండ మహత్యం 

"నాయనలారా! స్కంద పురాణ లిపి ప్రకారం జగన్నాథుడే పురుషోత్తముడు .మానవులకు సధ్గుణాలతో జీవితాన్ని ఎలా గడపాలో తెలియచెప్పడానికి ఆయన నీలాచలం అనే కొండపై దారుబ్రాహ్మణ అవతారం ఎత్తాడు.

ఈ క్షేత్రానికి సంబంధించిన ఇతిహాసం ఒకటి ఉన్నది. కృత యుగంలో హిరణ్యాక్షుడనే దానవుడు భూమిని చాప చుట్టినట్లు చుట్టి కొనిపోయి సముద్రము అడుగున దాచాడు. ఆ సమయంలో లోకాలను ఉద్ధరించడానికి శ్రీమహావిష్ణువు వరాహ రూపం దాల్చాడు. హిరణ్యాక్షుని చంపి, భూమిని సంరక్షించాడు. అంతటా బ్రహ్మ దేవుడు ఈ సముద్ర తీరంలో పురుషోత్తమ క్షేత్రం నిర్మించాకే సృష్టి కార్యం మొదలెట్టాడు.

తన సృష్టి నుంచీ జనించిన జనులకు ముక్తి మార్గం చూపాలని తలచి బ్రహ్మ నారాయణ మూర్తిని ప్రార్ధించాడు. మాధవుడు దర్శనం ఇచ్చి ," ఈ సముద్ర తీరంలో నీలాచలం అనే క్షేత్రం ఉంది. దాని ప్రభావం ఎట్టిదో మునులకూ, దేవతలకూ కూడా గ్రహింప శక్యం కాదు. నేను శంఖ చక్ర గదా దారిని అక్కడ నిజ శరీరం తో నిలిచి ఉంటాను. ఇది మహా ప్రళయ కాలమున సైతం నశించదు. అక్కడి రోహిణీ కుండంలో స్నాతలై నన్ను ఆరాధించిన వారికి, నేను ఏ వరమయినా ఇస్తాను. నీవునూ అచటికి పోయి నన్ను సేవిమ్పుము,' అని చెప్పి అదృశ్యమయ్యాడు. బ్రహ్మ నీలాచల క్షేత్రానికి వెళ్లి అక్కడి జగన్నాథ మూర్తిని, రోహిణీ కుండాన్ని దర్శించి, ధన్యుడయ్యాడు.

సాధారణంగా అన్ని క్షేత్రాలలో భగవంతుడు తమ దేవేరులతో కొలువై వుంటాడు. కాని, ఇందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో 'అన్న బల భద్రుడు (బలరాముడు), చెల్లి సుభద్రతో కూడి జగన్నాథుడు కొలువై వుంటాడు! సాధారణంగా ఆలయాలలో మూలమూర్తులు నల్లరాయితో గాని, పాలరాయితో గాని మలచబడి, ప్రతిష్ఠించబడి ఉంటారు. ఉత్సవ మూర్తులు పంచలోహ మూర్తులుగా వుంటాయి. వీటికే ఉత్సవాలు... కళ్యాణాలు, ఊరేగింపులు, తిరుమంజనాలు నిర్వహిస్తారు. కాని పూరి ఆలయంలో దారునిర్మిత విగ్రహాలు (కొయ్యబొమ్మలు) పూజలందుకుంటున్నాయి. ఇక్కడ బౌద్ధ, జైన, తాంత్రిక, కొండ జాతుల రీతులలో పూజలు జరుపబడుతూ వుంటాయి. ప్రతి ఏటా జరిగే జగన్నాథ రథ యాత్రకు మూల విగ్రహాలే తరలి వస్తాయి. ఆ విగ్రహాల ఆకారం పూర్తిగా వుండదు. తల మాత్రం స్పష్టంగా వుంటుంది. విశాలమైన నేత్రాలుంటాయి. జగన్నాథునికి కాళ్లుండవు, చేతులు అసంపూర్తిగా వుంటాయి. ఇలా వుండటానికి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో వుంది...

 సదానందయోగి తన శిష్యులకు పూరీ జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణాన్ని గురించిన కధను ఇలా చెప్పసాగారు....

"ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దైవ భక్తుడు. నీలాచలం అనే పర్వతం మీద జగన్నాథ స్వామి సుభద్రా బలరాముల తోడి వెలసి యున్నాడని బ్రాహ్మణుల ద్వారా తెలుసుకున్న ఆయన వారిని దర్శించడానికి అక్కడికి వెళతాడు. జగన్నాథుడు ఆయన భక్తిని పరీక్షించాలని అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. రాజు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగి స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటాడు. ఒక రోజు కలలో రాజుకు జగన్నాథుడు కనిపించి సముద్రపు అలల్లో రెండు కొయ్య దుంగలు ఒడ్డుకు కొట్టుకు వస్తాయనీ వాటి నుంచి తమ విగ్రహాలను చెక్కించమని కోరాడు.
అలా కొట్టుకువచ్చిన కొయ్యలను రాజు వెలికితీసి రాజ్యం లోకి తీసుకెళ్ళగానే సాక్షాత్తూ విశ్వకర్మ యే శిల్పి రూపమున వచ్చి తాను ఆ దారువులలో దేవతా మూర్తులను చెక్కెదనని అభయమిచ్చాడు. కానీ ఆయన ఒక నియమం పెట్టాడు. దాని ప్రకారం ఆయన ఒక గదిలో చేరి తలుపులు బిగించి శిల్పాలు చెక్కుతాడు. ఆయన చెప్పేవరకూ ఎవరూ ద్వారములు తెరువ కూడదని కోరాడు. పని ప్రారంభించి పది రోజులైంది.
ఒక రోజు రాజమాత లోపల యున్న శిల్పి పది రోజులుగా భోజనం లేకుండా ఉంటాడని భావించి తలుపులు తెరవమన్నది. తల్లి మాట కాదనలేని రాజు అలాగే తలుపులు తెరిపించాడు. కానీ అక్కడి శిల్పి అదృశ్యమయ్యాడు. అప్పటికే చేతులూ, కాళ్ళు తప్ప మిగతా భాగాలన్నీ పూర్తయ్యాయి. అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను ఏమిచేయాలో రాజుకు తోచలేదు. వాటిని అలాగే ప్రతిష్టించాలను దైవవాణి ఆజ్ఞాపించడంతో విగ్రహాలను అలాగే ప్రతిష్టించారు.
ఈ ఆలయం 4,00000 చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూరా ఎత్తైనా ప్రాకారం కలిగి ఉంది. లోపల సుమారు 120 దాకా ఆలయాలు ఉన్నాయి. అద్భుత శిల్పకళా నైపుణ్యం, సాంప్రదాయిక ఒరిస్సా ఆలయ శిల్పకళతో ఈ ఆలయం భారతదేశంలో అతి పురాతమైన కట్టడాల్లో ఒకటి. "

ఆదిశంకరాచార్యులు నిర్మించిన నాలుగు పీఠాలలో పూరీలోని జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం 214 అడుగుల ఎత్తులో కట్టడంవల్ల చాలా దూరంనుంచే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన ఆలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలతో, ఆలయానికి నాలుగువైపులా ప్రవేశ ద్వారాలతో అత్యంత సుందరంగా నిర్మించారు.

జగన్నాథ ఆలయంలో దైవ దర్శనానికి ఎప్పుడు కూడా క్యూ పద్ధతిని పాటించరు. ఎల్లప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ఈ ఆలయంలో ప్రతిరోజూ కొన్నివేల మందికి అన్నదానం చేస్తారు.  

జగన్నాథ ఆలయానికి ఒక ప్రత్యేకమైన వంటగది, అది కూడా ప్రపంచంలోనే చాలా పెద్దది ఉండటం విశేషం. ఇక్కడ ప్రతిరోజూ 56 రకాల ప్రసాదాలను తయారు చేస్తారు. పురాణాల ప్రకారం స్వయంగా మాహాలక్ష్మి వచ్చి ఇక్కడి వంటలను పర్యవేక్షిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ప్రసాదం తయారు చేయడంలో ఏదైనా పొరపాటు జరిగితే వంటశాల పరిసరాల్లో ఒక కుక్క కనిపిస్తుందని కూడా ఒక విశ్వాసం ఉంది. దీన్ని ఆలయ వంటవాళ్ళు (మహాసురులు అనికూడా అంటారు) అపశకునంగానూ, మహాలక్ష్మి సంతృప్తి చెందలేదని భావించి వండిన పదార్థాలన్నీ పూడ్చి వేసి మరల వంట చేస్తారు. ఈ వంటలన్నీ హిందూ ధర్మ శాస్త్రాలకనుగుణంగానే జరుగుతాయి. వంట చేయడానికి కేవలం మట్టి పాత్రలను మాత్రమే వాడతారు. అలాగే వంటకు అవసరమయ్యే నీటిని దగ్గర్లో గల గంగజమున అనే రెండు ప్రత్యేకమైన బావుల్లోంచి మాత్రమే సేకరిస్తారు. జగన్నాథునికి నైవేద్యం సమర్పించాక మిగతా ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు.

ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర.   జగన్నాథ నామస్మరణతో మార్మోగుతాయి . ఉదయమే ఆలయం ఎదుట జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి,  సుభద్రల కోసం ప్రత్యేకంగా మూడు రథాలను ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల వస్త్రాలతో, పూలతో ఆలయ నిర్వాహకులు అలంకరిస్తారు . పూజా ది కార్యక్రమాల  అనంతరం 45 అడుగుల ఎత్తు.. 16 చక్రాలు కలిగిన ‘నందిఘోష్’ రథంపై జగన్నాథ స్వామి విగ్రహాన్ని, 44 అడుగుల ఎత్తు.. 14 చక్రాలు కలిగిన ‘తాళధ్వజ’ రథంపై బలభద్ర స్వామి విగ్రహాన్ని, 43 అడుగుల ఎత్తు.. 12 చక్రాలు కలిగిన ‘దర్పదళన్’ రథంపై  సుభద్ర  విగ్రహాన్ని భక్తుల జయజయ ధ్వానాల నడుమ అధిష్టింపచేస్తారు . 
ఇలా దేవతావూపతిమలను రథాలపై అధిష్టించడాన్ని ‘పహండీ’గా పిలుస్తుంటారు. ఓ వైపు మంగళహారతులు, మరో వైపు భాజాభజంవూతీలు.. వాటి మధ్య జగన్నాథుని రథ చక్రాలు పూరీ పురవీధుల్లో ఊరేగుతాయి. ముందు సుదర్శన వాహనం సాగగా దాని వెనుకే సుభద్ర, బాలభవూదస్వామి రథాలు నడిచాయి. వాటిని అనుసరిస్తూ జగన్నాథ రథం కదులుతుంది. జగన్నాథస్వామి ఎదుట పూరి సంస్థానాధీశుడు జగపతి ‘చెరా పహారా’(బంగారు విసనకపూరతో వీచడం) నిర్వహిస్తుండగా యాత్ర కొనసాగుతుంది.  దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.  ఈ యాత్ర పూరీ నుండి గుండిచాదేవాలయం వరకు సాగుతుంది.

జగన్నాథ క్షేత్రం గురించి సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన విశేషాలు ...

పూరి జగన్నాథ తత్త్వము
(సద్గురు శివానందమూర్తిగారి మాటలలో)

గుణాతీతుడైన భగవంతుడు సత్త్వగుణమును ఆధారముగా చేసుకొని జగత్తులోనిజీవులందరిలోనూ సాక్షిరూపుడుగా ఉంటున్నాడు. రజోగుణమును ఆధారముగా చేసుకొని అంతర్యామిగా జీవగతిని ప్రవర్తింపచేస్తున్నాడు. జడమైన శరీరమునందు ఆభిమానము, ఆత్మభావన తమస్సుతో నిర్వహిస్తున్నాడు.
ఇది సూచించడానికే జగన్నాథ క్షేత్రమందు బలరామ కృష్ణ సుభద్రా రూపములు ఛిహ్నితమై ఉన్నవి. ఇందులో రెండుకన్నులను ఏకదృష్టితో అంతర్ముఖముగా చూస్తున్న జ్యేష్ఠ భ్రాతయైన బలరామమూర్తి సాక్షితత్త్వమును సూచిస్తున్నాడు. (Neutrality). రెండు కన్నులు బాహ్యంగా జగత్తునందే సంపూర్ణదృష్టితో ఉన్నట్లుగానున్న నీల వర్ణపు శ్రీకృష్ణమూర్తి అంతార్యామిత్వమును సూచించుచున్నది.(Activity). వీరిద్దరితోటి జన్మించిన సుభద్ర జగత్తుయొక్క ప్రకృతి తత్త్వమును సూచిస్తున్నది. ఈ మూడూ కలిస్తేనే అది జగన్నాథ తత్త్వము ఔతున్నది. సుభద్రను జీవ చిహ్నమైన నరుడు (అర్జునుడు) వరించి పరిగ్రహించినాడు. వారికిపుత్రుడుగా దేహాభిమానమునకు చిహ్నమైన అభిమన్యుడు అన్మించడం జరిగినది. సాధకుని (శిష్యుడైన అర్జునుని) దేహాభిమానమును హృత్పద్మమందు ప్రవేశపెట్టి తిరుగులేక నిర్మూలించడమే పద్మవ్యూహములో ప్రవేశించి నిహతుడైన అభిమాన్యుని గాథకు యోగపరమైన అర్థము.

No comments:

Post a Comment