Tuesday, December 10, 2013

కదంబం

'అచ్చంగా తెలుగు' ముఖ పుస్తక బృందంలో వివిధ సభ్యులు అందించిన అమూల్యమైన సమాచారం

శ్రీనివాస్ రావినూతల ( తెలుగు మాసములు )

మన తెలుగు మాసములు చాంద్రమానం ప్రకారము నడుస్తాయి. అయితే పౌర్ణమి రోజు ఉన్న నక్షత్రంతో ఆ మాసం పేరు ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందామా: 

"చిత్తా"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "చైత్రము"

"విశాఖ"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "వైశాఖము"

"జ్యేష్ట"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "జ్యేష్ట మాసము"

"పుర్వాషాడ"లేక "ఉత్తరాషాడ"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "ఆషాడము"

"శ్రవణ"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము 'శ్రావణము"

"పూర్వాభాద్ర"లేక "ఉత్తరాభాద్ర"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "భాద్రపదము"

"అశ్వని"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "ఆశ్వయుజము"

"కృత్తిక"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "కార్తీకము"

"మృగశిర"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "మార్గశీర్షము"

"పుష్యమి"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "పుష్యమాసము"

"మఘ"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "మాఘము"

"ఉత్తర ఫల్గుణి"నక్షత్రముతో కూడిన పౌర్ణమి కల మాసము "ఫాల్గుణము"

***************************************************

"కవితా గౌతమి" డా.కావూరి పాపయ్య శాస్త్రి గారి సౌజన్యంతో:

ధర్మార్థకామ సాధనకుపకరణంబు 
గృహనీతి విద్యకు గృహము విమల 
చారిత్ర శిక్షకాచార్యకంబన్వయ 
స్థితికి మూలంబు సద్గతికి నూత 
గౌరవంబునకేక కారణంబున్నత 
స్థిర గుణమణుల కాకరము హృదయ 
సంతోషమునకు సంజనకంబు భార్యయ 
చూవె భర్తకు నొండ్లు గావు ప్రియము 

లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను 
నెట్టి తీరములను ముట్టబడిన 
వంతలెల్ల బాయునింతుల బ్రజలను 
నొనర జూడగనిన జనుల కెందు 
(ఆంధ్ర మహాభారతము,ఆదిపర్వం)

దాంపత్య ధర్మంలో భార్య యొక్క విశిష్టమైన,ఉన్నతమైన స్థానాన్ని వివరించే పద్యం ఇది. పురుషుడి ధర్మార్థ కామ సాధనకు భార్య ప్రధాన హేతువు. గృహస్థ ధర్మ నిర్వహణకు ఆమె ఆటపట్టు. పురుషుడి శీల ధర్మముల విద్యలకామె ఆచార్య స్థానము. వంశ అభివృద్ధికి మూల కందము. ఉత్తమ గతులకు ఆమెయే ఆలంబనము. పురుషుని గౌరవాదరములకు ఇల్లాలే పుట్టిల్లు. స్థిరమైన గుణౌన్నత్యమునకు ఆమెయే ఆకరము. భర్త యొక్క హృదయ సంతోషమునకు భార్యయే సంజనకము. భార్య తప్ప భర్తకు ప్రియమైనది ఇంకొకటి లేదు. 

ఏ సందర్భమునందెట్టి క్లిష్టఘట్టములందెక్కడ నున్నను భర్త యొక్క ఇబ్బందులన్నింటినీ దూరము చేయగల్గునది భార్యయే. భార్యాభర్తల బంధమును,దాంపత్య ధర్మమునందలి ఆత్మీయతను సమగ్రముగా వివరించిన పద్యమిది. శకుంతల దుష్యంతునితో నుడివిన ధర్మ ప్రబోధకమైన మాటలు.

శ్రీనివాస్ మంచిరాజు (తిరుమల అమ్మవారి, అయ్యవారి గోత్రం, ప్రవర 

స్వామి వారి, అమ్మ వారి గోత్రం, ప్రవర
వాసిష్ట, 
మైత్రావరుణ , 
కౌడిన్య, 
త్రయ రిశేయ ప్రవరాన్విత వాసిష్ట గోత్రోద్భావాయ 
యాతేయ ప్రపొఉత్రాయ 
అమితతెజస్య పౌత్రాయ 
శూరసేనస్య వాసుదేవస్య పుత్రాయ వెంకటేశ్వరా నామ్నే వారే 
అంగీరస ,
భారస్పత్య ,
భరద్వాజ , 
శైబ్య ,
గార్గ్య 
పంచార్శేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భావాన్ 
సవీర మహారాజస్య ప్ర పొఉత్రీమ్ 
సుధార్మస్తూ పొఉత్రీమ్ 
ఆఆకశ రాజస్య పుత్రీం ఫద్మవతీమ్ కన్యాం

లీలా ప్రసాద్ ఎల్ వి  (శ్రీశ్రీ గురించి )

** అప్పటి ధరారమణ గౌరవాతిశయము
ఆ దినమ్ముల సౌఖ్యానుమోదరక్తి
నాటి సంపత్సమృద్ది ఏనాటికైనా
ఆంధ్ర నిర్భాగ్య ధాత్రికి నలవడునొకో?...

--- రాయల రాసిక్యాన్ని తిమ్మన వర్ణన ద్వారా గ్రహించి పరవశుడై ఆ కాలంలోకి మనోవేగంతో వెళ్లి, ఆ రాయల సభను కళ్ళారా 
చూసివస్తాడు. తానిప్పుడుoటున్న ఆంధ్రదేశం నిరుపేదగా కనిపించి, తిరిగి ఆ రాజు, ఆ సుఖం, ఆ సంపద వస్తే బాగుండునను
కుంటున్నాడు. ( అంతస్సమాధి - శ్రీ శ్రీ )

: సమరాహ్వనము -- శ్రీ శ్రీ :

1926 నవంబర్ "భారతి" లో ముద్రితమయింది. అందులో నాటకీయ శైలి, పదాల పొందిక, భాషావేగం, పద్య రచనా కౌశలం కనిపిస్తాయి. తేటగీతి మాలికలు గ్రుచ్చి,సామెతలు జాతీయాలు తెచ్చి నడిపించిన ఖండిక యిది. ఇందులో మహా భారతగాధ అంతా ప్రసక్తమవుతుంది.
ధర్మమే జయమను మాటను సుయోధనుడు మరచిపోయాడని వెక్కిరించాడు.

--- ధైర్యము త్యజించి ఘోర యుద్ధంబు సేయ
ననుచిత పలాయన పధంబు ననుసరించి
ఓ సుయోధన ! యెందేగి యుంటి విపుడు
రమ్ము ! క్షత్రియోచిత సంగరం బొనర్ప ....

: అభిసారిక (1927) -- శ్రీ శ్రీ :

తన ప్రియుడ్ని కలసుకొనుటకు అభిసారిక ఒక కాళరాత్రిలో గాలివానలో ఏకాంతంగా బయలుదేరింది. ఆమె సంకేత స్థలం ఒక దుర్గమారణ్యం. 
ఆమె సాహసి. ఈమె విషయ వాంఛలకోసం వెడుతున్నట్లు కనిపించదు. ఈ జీవితాన్ని, ఈ ప్రపంచాన్ని విడిచి భక్తుడు పరమేస్వరాభిముఖంగా సాగిపోతున్నట్లు గా వుంది. అడవులు, చీకటి రాత్రులు ఆమెకు అవాంతరాలు కాదు.

--- అయిన నేమాయె ప్రేమ మెంతైనc జేయు
దుర్గమ భయంకరారణ్య దుర్గములను
ప్రళయ కాల సమాన విభావరులకు
ప్రణయ రాజ్య రమా ప్రా ణ పతి కొఱకయి
తరలియరిగెడు నా కవాoతరములగునే ....

: ప్రళయ నర్తనం -- శ్రీ శ్రీ :

ఈ లోకమంతటిని మూడవ కంటితో తగులబెట్టి శివుడు నర్తించాలిట ! తాండవం చేసే సమయంలో శంకరుడు అరుణా రాగ రంజితుడై 
సాక్షాత్కరించాలిట ! స్తోత్ర పరులై దేవతలంతా నిలబడి చూస్తూ వుండగా పరమానందంతో చేయవలిసిన శివనర్తనానికి 
"మాయా మేయ జగద్వినాశనం"పరమావధిగా భావించడం విచిత్ర మైన విషయం.

--- సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్సంపూర్ణ
సౌందర్యరాశీ యుక్తామల దివ్యమూర్తివయి
సాక్షీభూత నానామరుత్తోయ స్తోత్ర
గభీరగాన రససంతుష్టాoతరంగంబునన్
మాయామేయ జగద్వినాశన మతిన్
నర్తింపుమా శంకరా ! .....

--- శ్రీ శ్రీ గారికి 'శివుడు' కావ్య సామాగ్రియే?!
"ఆ హరునిటల మందు దాగియడగిన అగ్నిహోత్రమును నేను" అని ప్రకటించుకుంటూ,'హరోం హరహర హరహర హర' అని కదలమని పీడితులకు ప్రభోదిస్తాడు.

( సేకరణ: శ్రీ శ్రీ కవితా వైభవం -- డా. మిరియాల రామకృష్ణ గారు.)

రమాదేవి 

యండమూరి వీరేంద్రనాథ్ రచనల్లోనుంచి ఏరికూర్చిన సుభాషిత సంపుటం "మంచుపూల వర్షం" నుండి పాఠకుల అభిప్రాయం ప్రకారం అత్యుత్తమ రేటింగ్ ఇవ్వబడిన సుభాషితాలు
మైండ్ పవర్ : నంబర్ వన్ అవడం ఎలా?

1.ప్రతీ గమ్యాన్ని చేరుకోవడంలోనూ, "నేను కష్టపడుతున్నాను" అన్న ఫీలింగ్ ఉన్నవాడు జీవితంలో ఎప్పుడూ నెంబర్ వన్ కాలేడు.
2.ఈ ప్రపంచంలో కష్టమయిన పని అంటూ ఏది లేదు. మనకి అదంటే ఇష్టం లేకపోవటం వలన అది 'కష్టం'గా మారుతుందంతే.
3.మరొకరు హీరోగా నటించే చిత్రంలో సైడ్ కారెక్టర్ కాదు. మీ జీవిత చిత్రంలో మీరే హీరో.
4.మనిషి ధ్యేయం ఎప్పుడూ ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది. కొందరు మాత్రమే అక్కడకు చేరుకుంటారు.. అడుగువేసి అలసిపోని వాళ్ళు!!! 
5.నీకు హాని చేసేది "బలహీనత" , నీ వల్ల ఇతరులకి హాని జరిగితే అది "తప్పు". నీకు గాని ఇతరులకి గాని హాని జరగని పని. నీ సంతృప్తి కోసం నువ్వేది చేసినా పర్వాలేదు.
6.తన గురించి 'మెదడు'తో ఆలోచించి. ఇతరుల గురించి 'మనసు' తో ఆలోచించగలిగిన వాడే నెం.1 కాగలడు.
7.నిన్నటి ఓటమి గురించి చింతని, రేపటి సాయంత్రంపు దిగులుగా మారనివ్వకు, ఈ రోజుని అనుభవించు.
8.నెం.1 అవడమంటే అమితమైన ధనమూ, అంతులేని అధికారమూ సంపాదించటం కాదు. కీర్తి, అధికారం, మానవ సంబంధాలు అనే అయిదు అంశాల్ని సంపాదించటానికి '...తృప్తి' నీ ఖర్చుపెడుతూ ఉంటాడు సామాన్యుడు. తృప్తిని స్టాండర్డ్ గా పెట్టుకుని, దాన్ని పెంచుకోవటానికి డబ్బు, కీర్తి, అధికారం, ప్రేమ మానవసంబంధాలని ఆధారం చేసుకుంటారు నెం.1 అదే తేడా.

దేవరకొండ సుబ్రహ్మణ్యం 


సత్తెకాలపు నాయెంకి
నండురి వెంకటసుబ్బారావు

"నీతోటె వుంటాను నాయుడు బవా!
నీమాటె యింటాను నాయుడు బావా!"

"సరుకులేమి కావాలె సంతన పిల్లా?"
"నువ్వు మరమమిడిసి మనసియ్యి నాయుడు బావా'
"సక్కదనము కేమిత్తు సంతన పిల్ల?"
"నువ్వు సల్లగుండు పద్దాక నాయుడు బవా!"
"యేడనే నీ కాపురమో యెల్తురు పిల్లా?"
" నీ నీడలోనె మేడ కడతా నాయుడు బావా!"
"నీతోటె వుంటాను నాయుడు బావా!"
"నీమాటె యింటాను నాయుడు బావా!"

****************************

మున్నే జేసిన పుణ్యమూలమొ! మరే పూజాఫలంబౌనొ! లే
కెన్నో జన్మల పూర్వబంధమొ! భవత్కృత్యంబొ గానీ ప్రభూ!
నన్నీ జన్మ నొకింత గొల్చితిని; సంతృప్తిన్ సమీక్షించి నీ
ఔన్నత్యంబును చాట బ్రోవుమయ - దాక్షారామ భీమేశ్వరా!

ఆచార్య వీ.ఎల్.ఎస్. భీమశంకరం గారి "దాక్షారామ భీమేశ్వర శతకము" నుండి.

గోటేటి వెంకటేశ్వర రావు 

రాయప్రోలు మాట రతనంపు పాట!!
********************************
భాష జీవించడానికి భావుకుడైన రచయిత అవసరం.రాయప్రోలువారు బాలలకోసం రాసిన గేయం.

తెల్లపాగా పెట్టి-నల్ల గుఱ్ఱంబెక్కి
చెంగనాలెత్తేవు -చందమామా
నింగిపై కెగిరేవు చందమామా
నీ సిగల బంగారు కేసరాలాడేను
నీ రెక్కలను పసిమి నిగనిగలు చిమ్మేను
నీ పాదు చల్లగానీ మారనిలిచేను
నీ పాల పొట్టలను తీపి తునకులు తొలుకు 
వెన్నెలగు-
నీ వెన్నుపూసల్ అన్నమయి వెలసేను.

-అంటూ పిల్లలను పెద్దలను గిలిగింతలు పెట్టారు మహానుభావుడు.

-గోటేటి వెంకటేశ్వర రావు,ప్రముఖాంధ్ర.







No comments:

Post a Comment