Sunday, December 29, 2013

సుభాషితాలు

'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో మిత్రులు అందించిన సుభాషితాలు...

జ్ఞాన వల్లి

రహస్యంగా ఇతరులను నిందించటం పాతకమని గ్రహించు.దాన్ని నువ్వు పూర్తిగా విడనాడాలి.మనస్సుకు అనేక విషయాలు తోచవచ్చు.కాని వాటిని వెల్లడింప పూనుకుంటే ,గోరంతలు కొండంతలౌతాయి..క్షమ చేతనే ,విస్మరణ చేతనే సర్వం అంతమొందుతుంది..

గాంభీర్యమూ,శిశుసహజమూ ఐన నిష్కాపట్యాన్ని సంతరించుకోండి..అందరితో అనుకూలంగా వ్యవహరించండి.పాక్షిక భావాలకి తావివ్వకండి.వ్యర్ధ వాగ్వాదం మహాపాతకం..

వ్యర్ధ వాగ్వాదం నిమిత్తం నీ వద్దకు యెవరైనా వస్తే ,మర్యాదగా తప్పుకో..సకల సంప్రదాయస్తులతోనూ నీ సానుభూతి ప్రకటించు.నీలో ఈ ప్రధాన గుణాలు ప్రకటితమైనప్పుడే మహాశక్తి సామర్ధ్యాలతో పనిచేయగలుగుతావు.

నిరుత్సాహమూ,అధైర్యమూ యెన్నటికీ ధర్మం అనిపించుకోవు..సదా మందహాస వదనంతో ఆనందమూర్తివై ఉంటే యే ప్రార్ధన కంటే కూడా ఇది నిన్ను విశేష భగవత్సన్నితుణ్ణి చేస్తుంది..

*****************************

వేదాంతం పాపాన్ని యెన్నడూ చూడదు.కాని దోషాన్ని గుర్తిస్తుంది.దుర్భలుడనని,పాపినని,నిర్భాగ్యుడనని,శక్తిహీనుడనని,యేదీ చేయలేనని తలచడమే వేదాంతం మహా దోఅషంగా పరిగణిస్తుంది..

బలమే గీవనం,,దౌర్భల్యమే మరణం,బలమే సౌఖ్యం,శాశ్వత జీవనం,అమరం:దౌర్భల్యం నిరంతర ప్రయాస.దు;ఖం.దౌర్భల్యమే మరణం..బాల్యం నుండీ,కాదు శైశవం నుందీ బలోపేతం,సానుకూలం,దోహదకరం ఐన భావాలను మెదడులో జొరబడనివ్వాలి..

దౌర్భల్యమే బాధకు కారణం.దుర్భలులం కావటం వలననే అస్త్యమాడుతాము,చంపుతాము,అనేక ఇతర నేరాలు చేస్తాము.ఎంతో బాధను అనుభవిస్తాము.తద్వారా మరణిస్తాము.యెక్కడ మనలను దుర్బలిలను చేసేది ఉండదో, అక్కద మరణం కానీ,బాధ కానీ ఉండదు.

బలమే ఆవశ్యకమైనది.అదే భవ రోగానికి ఔషధం.ధనికుల వలన హింసకు గురి ఐయ్యినపుడు పేదలకు కావలసిన దివ్యౌషధం బలమే..పండితులచే అణగద్రొక్కబడిన పామరులకు కావలసిన ఔషధం బలమే..ఇతర పాపాత్ములచే పీడింపబడే పాపులకు ఆవస్యకమైన ఔషధం బలమే.

అందుకే స్వశక్తి మీద నిలబడి,ధీరుడవై మసలుకొంటూ బలిస్టుడవై ఉండాలి.యావత్తు బాద్యతను నీ భుజస్కంధాలపై వహించి నీ విధికి నీవే కర్తవని గ్రహించి నీకున్న బలసం రక్షణలు నీలో నిలుపుకొని ఆత్మ స్తైర్యంతో నీ భవిష్యత్తుని నీవే తీర్చి దిద్దికోవాలి......

********************************

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా...అని ఒక కవి గారు ఒక పాట లో రాశారు...మనం ఎంతోకాలంగా అనుకుంటున్నది,,యెదురుచూస్తున్నదీ ఇక జరగదేమో ,,ఇక అవ్వదేమో,,ఇక రాదేమో..అనుకుంటూ నిరాశా,నిస్పృహలతో విసిగి వేసారి ఉన్నప్పుడు...సడన్ గా అది జరిగితే,ఐతే,వస్తే,ఆ ఆనందం వర్ణింపనలవికానిది..ఈరోజు ఆ ఆనందాన్ని అనుభవించాను.ఒక విషయంలో...దేముడు ఉన్నాడు..అవును..ఉన్నాడు...మన వెనుకే ఉండి అన్నీ చూస్తూ నడిపిస్తాడు...నమ్మకం,,విశ్వాసం ఉంచితే తప్పక అనుకున్నది జరుగుతుంది....ఆనందంలోనూ,,దు;ఖంలోనూ కన్నీరే వస్తుంది..థాంక్ గాడ్.....ఈరోజు నాకు చాలా మంచిరోజు.....

~~~~~~~~~~~~~~~~~~~

కెఎస్ఎన్ మూర్తి 

మనిషి స్వతంత్రంగా పుట్టాడు.కాని అతడు అన్ని చోట్లా బంధాలతో బంధింపబడి ఉన్నాడు.-రూసో

~~~~~~~~~~~~~~~~~~~~
షీలా తూపురాని 

పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గదిలాంటిది.

హృదయమే ఉత్తమ భోదకుడు , కాలమేఉత్తమ గురువు , ప్రపంచమే ఉత్తమ గ్రంధం ,భగవంతుడే ఉత్తమనేస్తం.

~~~~~~~~~~~~~~~~~~

పతనేని జోగారావు 

మన సంస్కారాల అంతరార్థం :

భారతీయ సంస్కౄతిలో చెప్పబడినవన్నీ సమజహితం కోసమే ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు మానవ వికాసానికై ౠషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి.
మనుస్మౄతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది. 1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం. అయితే మరికొంతమంది స్మౄతికాకురులు ఈ సంస్కారలను షోడశ (16) సంస్కారాలుగా పేర్కొన్నారు. కర్ణభేధం, విద్యారంభం, వేదారంభం, అంత్యేష్టి అంటూ మనువు చెప్పిన 12 సంస్కారాలకు, ఈ నాలుగు సంస్కారాలను జోడించి షొడశ సంస్కారాలుగా గుర్తించారు.
మనిషి పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది. సంస్కారల ఆచరణ మనిషి జీవితంలో వివాహాంతో మొదలవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. తద్వారా మన సంస్కారములు ప్రధానోద్దేశ్యం జీవుల క్షేమమేనని తేటతెల్లమవుతోంది. వేదోపనిషత్తుల ప్రకారం మన శరీరం ఐదు అంశాలమయంగా విభజింపబడింది.
1. అన్నమయ కోశం – భౌతిక శరీరం
2. ప్రాణమయ కోశం – శక్తి కేంద్రం
3. మనోమయ కోశం – చింతనా కేంద్రం
4. బుద్ధిమయ కోశం – వివేకం
5. అనందమయ కోశం – పరమశాంతి
మన శరీరంలో ఈ ఐదు అంశాలు షోడశ సంస్కారాల ద్వారా సక్రమమైన రీతిలో చలిస్తాయనేది శాస్త్రవచనం ఈ సంస్కారాల వెనుకనున్న వైజ్ణానిక రహస్యాలు నేతి వైజ్ణానికులకు సైతం అశ్చర్యపరుస్తాయి.
1. వివాహం : వివాహం సమయంలో వధూవరులచే పలుమంత్రాలు చెప్పించబడుతుంటాయి. ఆ సమయంలో వరుడు, “భగ, ఆర్యమ, సవిత, పురంధి అనే దేవతలు గార్హపత్యం కోసం నిన్ను నాకు అనుగ్రహించగా, నా జీవితం సుఖమయమయమ్ అయ్ఏందుకు నీ చేయిని నేను పట్టుకున్నాను” అని చెబుతాడు.
2. గర్భాదానం : స్త్రీ పురష సంయోగం ద్వారా పుట్టబోయే సంతానం యోగ్యులుగా ఉండేందుకై ఈ సంస్కారం నిర్దేశించబడింది.
3. పుంసవనం : తల్లిం గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం.
4. సీమతం : గర్భవతికి ఈ సంస్కారాన్ని నిర్వహించడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షింపబడుతుంది.
5. జారకకర్మ : బిడ్డకు నెయ్యిని రుచి చూపి, పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది.
6. నామకరణం : బిడ్డ ఈ సమజంలో తనకంటూ ఓ వ్యక్తిత్వంతో వౄద్ధిలోకి రావాలన్న కోరికతో తల్లి దండ్రులు జరిపే సంస్కారం.
7. నిష్ర్కమణం : బిడ్దను తొలిసారిగా బయటకు తీసుకెళ్ళడం, చంటిబిడ్డను విభిన్న వాతావరణాలకు పరిచYఅం చేయడమో ఈ సంస్కారంలోని అంతరార్ధం.
8. అన్నప్రాశనం : బిడ్డకు బలవర్ధకమైన, ఆహారాన్ని పరిచయం చేయడం.
9. చూడాకర్మ : పుట్టువెంట్రుకలను తీయించడం ఈ సంస్కారంలోని ప్రత్యేకత.
10. కర్ణబేధ : చెవులు కుట్టించడం.
11. ఉపనయనం : బాల బ్రహ్మచారికి జరిపే సంస్కారం.
12. వేదారంభం : సమవర్తన సంస్కారాన్ని చక్కగా ముగించేందుకే వేదారంభం.
13. సమావర్తనం : పిల్లలు విద్య ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంస్కారం జరుపబడుతుంది.
14. వానప్రస్ధం : బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై జరిపే కర్మ.
15. సన్యాసం : ఐహిక బంధాల నుంచి విముక్తి పొందడం.
16. అంత్యేష్టి : పిత్రూణం తీర్చుకునేందుకు పుత్రులు చేసే సంస్కారం.

*****************************************

లక్ష్మీ నరసింహ స్వామిని ప్రదోష, పౌర్ణమిలలో స్తుతిస్తే?
లక్ష్మీ నరసింహుడు, సత్యనారాయణ స్వామి వంటి విష్ణుమూర్తులను పౌర్ణమి, ప్రదోషం నాడు పూజిస్తే.. ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది. అలాగే ఈతిబాధలుండవని, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. 

ఇంకా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రదోషం, పౌర్ణమి, స్వాతి నక్షత్ర సమయంలో కొబ్బరి నీరు, పాలు, పన్నీరు, తేనె, పసుపు, చందనం, తిరుమంజన పొడి వంటి అభిషేక వస్తువులతో అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయి. అభిషేకానికి పూర్తయిన తర్వాత తులసీ మాలను అర్పించి స్తుతించే వారికి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి.

లక్ష్మీ నరసింహ స్వామినిపై తిథుల్లో ఆరాధించే వారికి తీరని పదోన్నతి, విదేశీయానం చేకూరడంతో పాటు రుణబాధలు, మానసికాందోళనలు తొలగిపోతాయని అంటున్నారు



No comments:

Post a Comment