Saturday, September 8, 2012

అమరావతి కధలు 2

 
లంకల్ల పుట్టింది లచ్చి తల్లి






 ఈ రోజుల్లో స్విమ్మింగ్ నేర్చుకోడానికి ఎన్ని తిప్పలండి? దానికో డ్రెస్, కేప్, ముక్కు- చెవులకు బడ్స్, గాగుల్స్, ట్యూబ్ లు, నాన హడావిడి

చేసి, బోలెడు డబ్బు తగలెట్టి, చివరికి హమ్మో మా వల్ల
కాదు, అని వదిలేస్తారు. ఒక వేళ నేర్చుకున్నా, ఒక్క సారి ఆ చివరి నుంచి, ఈ

 

చివరికి ఈదేసరికి బస్తాలు మోసేసినట్టు ఆయాసపడి, దిక్కులు చూస్తారు. ఈదేది తక్కువ, విరామాలు, పానీయాలు ఎక్కువ. మరి కృష్ణ

 

వడ్డున గోడలకు, పాలేల్లకు, ఎవరు ఈత నేర్పారు? ఆ వద్దు నుంచి, ఈ వడ్డుకు కిలోమీటర్ పైన ఆగకుండా, వాళ్ళు ఎలా ఈదుతారు?ఇలా

 

ఆలోచించి, ఈ కధ చదివేటప్పుడు నవ్వుకున్నాను.

 

పశువులని మేపడానికి లంకలకు (నది మధ్య రెళ్ళు గడ్డి మొలిచిన చిన్న ద్వీపాలు) కధలోని ఇతివృత్తం. వందలాది పశువులు, గుభిల్లున

 

కృష్ణలో దూకుతున్నాయి. మొరలు నీళ్ళలో ముంచి వెంటనే పైకి తేలుతున్నాయి. రేవు చూడగానే, నీళ్ళలో దిగగానే, ఎక్కడ లేని ఆవేశం

 

వాటికి. పాలేళ్ళు తెప్ప కొయ్యాల మీద పడుకుని, తలల మీద చద్ది మూటలతో ఈదుతున్నారు. కొందరు ఆవు తోకలు పట్టుకుని,

 

ఈదుతున్నారు. మంద విడిచి వెళ్ళిపోతున్న పసువులను, అదిలించి మందలో కలుపుతున్నారు. గొడ్లు లంకల్లో మేతకు పడ్డాకా, బువ్వ

 

మూతలు విప్పి, పచ్చళ్ళు పంచుకుంటూ తిని, ఎవరో కొమ్మెక్కి పిల్లన గ్రోవి వాయిస్తుంటే వింటూ, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

 

సాయంత్రం మొక్క జొన్న చేలోంచి, పది కండెలు అడిగి కోసుకు తిన్నారు. అందరు బయల్దేరి వెళ్ళిపోగా, పున్నయ్య గారి కర్రావు రానని

 

మొరాయించింది. పాలేరు రాములుకి అది ఈనడానికి సిద్ధంగా ఉందని అర్ధమయ్యింది. దూడ పుట్టగానే, కర్రావుకు ఎక్కడ లేని తమకం,

 

తొందర...ప్రేమగా నాకేస్తోంది. రాత్రంతా, ఆవును అక్కడే ఉంచితే, వాతం కమ్ముతుందని, రాములుకి ఆందోళన. ఇవతలోడ్డున పున్నయ్య గారు

 

కంగారు పడిపోతున్నారు. ఆయనకు ఆ ఆవు కన్నకూతురి లాంటిది. ఆవు ఈనిందన్న గట్టి నమ్మకం తోటి వేన్నీళ్ళు పెట్టించాడు, మడ్డి కూడు

 

వండించాడు. కాని ఆవు ఇవతలి వొడ్డుకు ఎలా వస్తుంది?


ఇంతలో అవతలోద్దుకు వెళుతున్న పడవ అటుగా వచ్చింది. సరంగును బతిమాలి, ఆవుని, దూడని అందులో ఎక్కించి తను ఈదుకుంటూ

వెళ్ళాడు రాములు. ఇవతల వొడ్డుకు రాగానే, లాంతరులతో ఎదురు చూస్తున్న పున్నయ్య గారు, లేగ దూడను ఎత్తుకుని, ' మా తల్లే,

మా అమ్మే, ' అంటుంటే, కర్రావు పున్నయ్యను, దూడను మార్చి మార్చి నాకింది. సంబరంతో రంకెలు పెట్టింది. కొట్టంలో ఆవుని, దూడని

పున్నయ్య స్వయంగా కడుగుతుండగా, వాజ్యంలో పొలం పున్నయ్యకే దక్కిందని, కబురు వస్తుంది. 'గోడ్దోచ్చిన వేళ'.. అని పున్నయ్య భార్య

ఆనందంగా అంటుంటే, పున్నయ్య పొంగిపోయి, లేగ దూడను ముద్దెట్టుకున్నాడు...

సున్నితమయిన భావోద్వేగాలు నిండిన ఇటువంటి  కధలు నేడు చాలా అరుదు.

No comments:

Post a Comment