Monday, March 24, 2014

పద్యాల అంత్యాక్షరి

మా 'అచ్చంగా తెలుగు' ముఖపుస్తక బృందంలో సరదాగా పద్యాల అంత్యాక్షరి ఆడాము. ఇందులో ఎంతో మంది పిన్నలూ, పెద్దలూ ఆసక్తిగా పాల్గొన్నారు. ఆ పద్యాలన్నీ మీ కోసం...

సరదాగా పద్యాల అంత్యాక్షరి ఆడదాం...

మొదట నాకు నచ్చిన ఒక పద్యంతో మొదలు పెడతాను. ఆ పద్యం చివరి పదంతో, మీరు మరొక శతక పద్యం చెప్పాలి... వీలు కాకుంటే, వేరే ఏ పద్యమైనా సరే. వారు చెప్పిన పద్యం చివరి అక్షరంతో మరొకరు మరొక పద్యం చెప్పాలి. ఇంత మంది పెద్దలూ, పిల్లలూ ఉన్నారు. చూద్దాం, ఎన్ని పద్యాలు గుర్తుకు వస్తాయో...

అనువుగాని చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా..?
విశ్వదాభిరామ వినుర వేమ..!

తాత్పర్యం :
మనకు తగని ప్రదేశంలో, మనల్ని మనం గొప్పవారమని చెప్పుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. మనకు గల గొప్పతనమును, ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యమునకు ఎలాంటి భంగమూ కలుగదు.

కొండ ఎంత పెద్దదైననూ అద్దంలో చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది కదా..! అయినంత మాత్రాన కొండ చిన్నది అయిపోదు. అలాగే... మన గొప్పతనం, మనమే చెప్పుకోనంత మాత్రాన తగ్గిపోదని పై పద్యం యొక్క భావం.

మరి పెద్దలూ, పిన్నలూ మొదలుపెట్టండి...

పవిత్రా కాశ్యప్

మృగ మదంబు జూడ మీద నల్లగనుండు
బరిడవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ..!

అర్ధం : ఓ వేమా.. కస్తూరి అనే సువాసనద్రవ్యుం రంగు నల్లగా కానీ వాసన మాత్రం చాలబాగుంటుంది. అలాగే మంచి మనుషుల రూపం ఏవిధంగావున్నా మనసు మాత్రం ఎంతో చక్కగా ఉంటుంది.

సంధ్యా రాణి 

మర్మము పరులకు దెలుపకు
దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు
ష్కర్మముల జేయ నొల్లకు
నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా!

 ఓ కుమారా! నీ రహస్యములెప్పుడూ ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో.

దుర్గ భమిడిపాటి (అదే సమయంలో )

ముక్కోటి దేవులందురు 
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించేనయా 
చక్కనిది ఆవకాయన 
ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్

సంధ్యా రాణి గారి పద్యం చివర 'ర' కు పద్యం - కళ్యాణ్ కృష్ణ కుమార్ 

సీ . "రండిరా యిదె! కాల్చుకోండిరా" యని నిండు
గుండెలిచ్చిన మహోద్దండమూర్తి!
పట్టింపువచ్చెనా బ్రహ్మంతవానిని
గద్దించి నిలబెట్టు పెద్దమనిషి!!
తనకు నామాలు పెట్టిన శిష్యులను గూడ
ఆశీర్వదించు దయామయుండు!!!
సర్వస్వము స్వరాజ్య సమరయజ్ఞము నందు
హోమమ్మొనర్చిన సోమయాజి!!

అతడు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు
నమ్మికొల్చిన ఏకైక నాయకుండు!
మన "ప్రకాశము" మన మహోమాత్యమౌళి!!
సరిసములు లేని "ఆంధ్రకేశరి" యతండు!!!!

-కరుణశ్రీ

                                            Kalyan Krishna Kumar's photo.

దుర్గ గారి పద్యానికి 'న ' తో వెంకట కోటేశ్వర రావు గారు అందించిన పద్యం 


                                Venkata Koteswara Rao B's photo.

సూర్యప్రభ ముత్యాల 

మేడి పండు చూడ మేలిమై ఉండు 

పొట్ట విప్పి చూడ పురుగులుండు 

పిరికి వాని మదిని బింకమీలాగురా 

విశ్వదాభిరామ వినుర వేమా!

మల్యాల పల్లం రాజు గారు 

వెన్నెముక లేని కవులకు
పెన్నెరులు, కురుల్,పగటివేషాలు కన్
సన్నలలంకారములట
విన్నావా ముళ్లపూడి వెంకటరమణా.

(శ్రీ అబ్బూరివారు - విన్నావా ముళ్లపూడి వెంకటరమణా అని ఓ శతకం రాశారట. దానిలో పద్యమిది..బాపూ రమణీయం కోతి కొమ్మచ్చి నుంచి...) గిరజాలు..వేషాలు ...ఫోజుల కవుల గురించి..

ఇక్కడ పడిందండీ అందరికీ బ్రేక్... 'ణ ' తో పద్యమే! కమల గారి సందేహం... సమాధానం చూడండి...
ణ తో మాటలే రావట్లేదండి అసలు... ణ తో ఎవరినా చెప్పేవరకు న తో చెప్పొచ్చా? లేక ఫై పద్యంలో ఆఖరి పదం లో ఆఖరి అక్షరానికి ముందు అక్షరం అయిన 'మ' తో చెప్పోచ్చ? 

ణ తో ఒక మాట దొరికిన్దండోయి... 'ణిసిధాత్వర్థము' అని ఒక మాట ఒక నిఘంటువు లో కనిపించింది... అయితే పద్యాలు మటుకు రావడం లేదు ఏమీ...

నిజానికి పల్లం రాజు గారు 'మా' తో వ్రాసే బదులు 'వ' తో వ్రాసారు కదా, అందుకని, ఇక అంతా కలిసి మళ్ళీ 'మ' తో పద్యాలు పాడేసుకున్నాము .

గోమతి రవి 

మకర మొకటి రవిఁ జొచ్చెను;
మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
మకరాలయమునఁ దిరిగెఁడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.
ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి.

నీ పాద కమల సేవయు నీ పాదర్చకులతోడి నెయ్యము నితాం
తాపార భూతదయయును దాపస మందార నాకు దయసేయగదే.


దీపము కలిగిన ఇంటను 
దాపున శ్రీలక్ష్మి జేరి ధనములనిచ్చున్ 
కాపడుచుండు మనుజుల 
పాపమ్ములు పారద్రోలి, పాలించుసుమీ!

గోమతి గారి ధాటికి 'ఆయ్... అంతా మీరే ఆడేసుకుంటారా?' అంటూ ఆవిడని అడిగారు ఒకరు. 
ఆలస్యంగా వచ్చినందుకు అందుకోవాలిగా మీతొ...:)... ఇదండీ ఆవిడ సమాధానం . మళ్ళీ ఆట కొనసాగింది...

కమల ఈవని 

మాటకు బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ

మనమాడిన మాటకు ప్రాణము సత్యము. కోటకు వీరభటుల సైన్యమే ప్రాణము. అదిలేని కోట శత్రువులకు సులభముగా వసమగును... ఆడవారికి శీలమే ప్రాణము. వ్రాసిన కాగితమునకు సంతకము లేనిచో విలువ లేదు... సంతకము చేసినచో దానికి ప్రాణము వచ్చి యెంత పనిఅయిన చక్కబెట్టును...

గోమతి రవి 

తొలుతనవిఘ్నమనుచు ఢూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య ఏకదంతమా నిను ప్రార్ధన చేసెద నా 
వెలుపటి ఘంటమున వ్రాక్కున నెప్పుడు బాయకుండుమీ 
తలపున నిన్ను వేదెద దేవ గణాధిప లోకనాయకా !

ఇటువంటి ఆటలు ఆడితే, విజ్ఞానం, వినోదం రెండూనూ... ఏమంటారు?







No comments:

Post a Comment