Saturday, September 8, 2012

తాతయ్య కబుర్లు


గొబ్బిళ్ళ పద్యం 




"సుబ్బీ! అదిఇది గొణగక గొబ్బున బొబ్బట్లు మింగి గొరగొర రా రా!

గొబ్బండుగ మన కనులకు
గొబ్బిళ్ళకు బంతిపూల గొడుగులు తోడుగన్."

అది సంక్రాంతి పండుగ. ఎక్కడ చూసినా సంబరాలే! అంతకు ముందు రొజు భోగి నాడు వేసిన భోగి మంటలు ఇంకా చల్లారలేదు. సంజ చీకట్లు

 గోరగోరా ముసురుకుంటున్నాయి. యే వీధిలో చూసినా రంగు రంగుల ముగ్గులూ, గొబ్బిళ్ళ పాటలూ కళ్ళకీ-- చెవులకీ విందు చేస్తున్నాయి.

గొంగళి కప్పుకుని గొంతుక్కూర్చుని తాతయ్య ఆ పాటలు వింటూ, ఆ ముగ్గులు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ నవ్వులు బామ్మ

హృదయానికి ముత్యాల గొలుసులు. వాళ్ళ మనవలు కాంతి, సుబ్బి... కాంతి గొబ్బెమ్మలు పెట్టుకునే ప్రయత్నంలో ఉంది. పసుపు, కుంకుమ,

ఆవుపేడ, బంతి పూలు, అటుకులు- బెల్లం, అగరొత్తులు అన్నీ సిద్ధం చేసుకుంటోంది. ఎక్కడి నుంచి ఊడి పడ్డాడో సుబ్బిగాడు, తను

వచ్చేవరకు గొబ్బిళ్ళు పెట్టడానికి వీల్లేదని చెప్పి, గొట్టం పాంటు సవరించుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వాడు రాకుండా గొబ్బిళ్ళు పెడితే

గొడవ చేస్తాడు. గొబ్బిళ్ళు కాళ్ళతో తొక్కేస్తాడు. వాడు అన్నింటికీ అక్కతో పోటి పడతాడు. వాడివి అన్నీ గొంతెమ్మ కోరికలే! అసలు వాడు

ఆడపిల్లగా పుడితే యే గొడవా లేకపోను. పాపం కాంతి వాడి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. మధ్య మధ్యలో వాడు ఏం చేస్తున్నాడో అని

ఇంట్లోకి వెళ్లి వస్తోంది. వాడు నేతిలో ముంచుకుని తాపీగా బొబ్బట్లు తింటున్నాడు. వాడి తిండి అంత తొందరగా పూర్తవదు. తనని చూసి ఏదో

గొనుగుతున్నాడు. ఓ పక్క గొంతు దిగని బొబ్బట్టు ముక్కతో తంటాలు పడుతూ...

కాంతి స్నేహితురాండ్రు తొందర చేస్తున్నారు. కాంతితో కలిసి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర గొబ్బిళ్ళు పెట్టుకోవాలి. ఇదంతా గమనించిన

తాతయ్య గొంతెత్తి సుబ్బిగాడ్ని పిలిచాడు.

" గొబ్బిళ్ళకు బంతి పూలు గొడుగుల్లా గుచ్చిన దృశ్యం మన కళ్ళకు గొప్ప పండుగ. కడుపుకు తినడమే కాదురా సుబ్బీ..ఇంకేమి గోనక్కుండా

ఆ బొబ్బట్లు గొబ్బున మింగి గోరగోరా రారా!"

అరిటాకులో సగం మిగిలిన బొబ్బట్టు ఊరిస్తోంది. నోట్లో ముక్క ఇంకా గొంతు దిగలేదు. " తాతయ్య! నేను తరువాత చుస్తానులే! అక్కని

గొబ్బిళ్ళు పెట్టేసుకోమను.."

సుబ్బిగాడి తిండి యావ చూసి తాతయ్య గొల్లున నవ్వేసాడు. కాంతి స్నేహితురాళ్ళతో కలిసి గొబ్బిళ్ళు పెట్టుకుంది.

( శ్రీ ఎర్రాప్రగడ రామమూర్తి గారి 'తాతయ్య కబుర్లు ' పుస్తకం నుండి...)

కవులు



కవులు
అసలు మా కవుల/ రచయతల/ రచయిత్రుల గురించి ఇంద్రగంటి హనుమాచ్చాస్త్రి గారు ఏమన్నారో తెలుసాండి? ' ఈ కవి గాళ్ళు ఉన్నారే,

వీళ్ళది చింతపండు జాతి. రాగి చెంబు లాంటి లోకాన్ని ఎంత తోమినా, కిలుము వదిలించగాలమా?' అని.

మరో శ్రీలక్ష్మిలా నేను చెప్పాలంటే, ' ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, పాత రచయతలయితే, కాగితం, కలం తీసేసి, రాసి పారేస్తారు.
    
 నవీనులు, కంప్యూటర్ ఆన్ చేసి, కీ బోర్డు మీద టైపు చేసేసి, లోకాన్ని కడిగి పారేస్తారు. లోపాల్ని ఉతికి ఆరేస్తారు. బంధాన్ని, అందాన్ని పొగిడి

 పారేస్తారు. మంద బుద్ధుల్ని చెరిగి పారేస్తారు. అదండీ సంగతి.

అసలు ఒక్క అడుగు వేసి, అందరిలో తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరచాలంటే, ఎంతో ధైర్యం, చొరవ కావాలి. ఎవరు మెచ్చినా,

విమర్శించినా, తాము నమ్మినది కుండ బద్దలుకొట్టినట్టు చెప్పగలగాలి. రాజకీయాలు, సామాజిక పరిస్తితులు, వ్యక్తుల మనస్తత్వాలు,

సినిమాలు, ఇలా ఏదయినా ఆ రొజు, ఆ నిముషంలో వాళ్ళ గుండె తలుపు తట్టే అనుభూతులను, మీ ముందుకు అక్షర రూపం లో తీసుకు

రావాలి. ఆ అక్షరాలు అర్ధవంతంగా, ఎదుటివారికి తమ భావాన్ని సుస్పష్టంగా తెలియచెయ్యాలి. ఏది బడితే, అది గజి బిజి గా రాసి పారేస్తే,

జనాలు సన్మానం చేసే అవకాశాలు భేషుగ్గా ఉన్నాయి.

'మరి మీ ప్రయాసతో సమాజాన్ని మార్చగలరా? ' అంటారా. సహజంగా మార్పు వ్యక్తి నుంచి కుటుంబానికి, కుటుంబం నుంచి సమూహానికి,
 
సమూహం నుంచి సంఘానికి వ్యాపిస్తుంది. ఒక్క రోజులో, పెను మార్పులు రాకపోయినా, కొద్దీ కొద్దిగా స్లో పాయిసన్ లాగ, మార్పుకు మీలో

అంకురార్పణ చేసి, చిగురింప చేస్తాం. అది మీకే తెలియకుండా, మీలో నిద్రాణంగా ఉండి, అవసరమయినప్పుడు, తుఫాను తాకిడి లా

పెల్లుబికి, మార్పుకు దోహదపడుతుంది. అదన్నమాట.

అయినా, ఏదో, ఒక గ్రూప్ పెట్టేసి, కొన్ని రాతలు రాసేసినంత మాత్రాన, మీరు పెద్ద రచయిత్రి లా ఫీల్ అయిపోతున్నారా, అంటారా? నా సంగతి

 మీకు తెలియదండోయ్ , ' నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కాదన్న వాడిని రాయిచ్చుక్కోడతా.' జై శ్రీలక్ష్మి, జై

చంటబ్బాయ్ సినిమా.

 

అశ్వఘోషుని బుద్ధ చరితం

 అశ్వఘోషుని బుద్ధ చరితం 
 
 
 
 
 'బుద్ధ  చరితం ' 17 సర్గల మహాకావ్యం. ఇందులో 14 సర్గలు మాత్రమే మనకు లభించాయి. ఇక్ష్వాకు వంశంలో శుద్దోదనుడు- మాయాదేవి
 
నే రాజదంపతులకు ఉండేవారు. గర్భవతి అయిన 'మాయాదేవి' కి స్వప్నంలో తన గర్భంలోకి ఒక తెల్లని ఏనుగు ప్రవేశించినట్టుగా

అనిపించింది. 'లుంబిని' వనానికి విహారానికి వెళ్ళిన రాణి, కనీసం ప్రసవ వేదన అయినా కలిగించని, మేలిమి బంగారు చాయతో మెరిసిపోయే,

బాలుడిని ప్రసవించింది. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. గాలులు సుఖ స్పర్శను కలిగిస్తూ వీచాయి. అగ్నిజ్వాలలు సౌమ్యంగా

వెలిగాయి. క్రూర జంతువులు సైతం తమ క్రూర ప్రవృత్తిని మానివేసాయి. స్నిగ్ధమయిన అర్ధనిమీలిత నేత్రాలు కల, దీప్తిమంతమయిన ఆ

బాలుడి -- పాదాలలోని చక్ర చిహ్నాలు, చేతి వేళ్ళు, కాలి వేళ్ళు పరిశీలించిన 'అసితుడు' అనే మహర్షి, ' జగత్తు లోని మోహము అనే

 అంధకారాన్ని పారద్రోలడానికి ఉదయించిన జ్ఞాన మయ సూర్యుడు ఈ బాలుడు. ' అని బాలుడి భవిష్యత్తు వివరించాడు. దైవజ్ఞులు 'రాజా!

యితడు రాజ్యమే కావాలనుకుంటే, సమస్త భూమండలాన్ని న్యాయ మార్గంలో జయించి, విరాజిల్లుతాడు. లేక మోక్షగామియై వనానికి

వెల్లినట్టయితే, తత్వజ్ఞానంలో అందరినీ మించిపోయి, అన్నీ మతాలను జయించి, అందరి చేతా మన్నింప బడే మహోన్నతమయిన మేరు

పర్వతంలా భాసిస్తాడు' , అని చెప్పారు. బాలుడికి 'సర్వార్ధ సిద్ధుడని' నామకరణం చేసారు. బాలుడి చిన్నప్పుడే, మాయాదేవి

దివంగతురాలయ్యింది. సాత్వికుడయిన శుద్దోదన మహారాజు ఒక పక్క ధర్మపత్ని ఎడబాటును- మరొక పక్క అసిత మహర్షి మాటలను

మననం చేసుకుంటూ, రాకుమారుని మనసు వైరాగ్యం వైపు మళ్ళకుండా జాగ్రత్త వహించాడు. అపురూప సౌందర్యవతి అయిన 'యశోధర'

అనే రాకుమార్తెతో వివాహం జరిపించాడు. మనస్సుకు ఆందోళన కలిగించే యే విషయమూ అతడి కంట పడకూడదని, అంతఃపురంలోనే అన్ని

ఏర్పాట్లు చేసి, బయటకు వెళ్ళకుండా ఉండేటట్లు చేసాడు. అందమయిన స్త్రీ ల సంగీత నృత్యాలతో రాకుమారుడు కాలం గడపసాగాడు.

సర్వార్ధసిద్దయశోధర దంపతులకు 'రాహులుడు' అనే చంద్ర ముఖుడయిన శిశువు జన్మించాడు. పుత్రోదయం తరువాత గౌతమునిలో పుత్ర

వాత్సల్యం కలుగుతుంది కాబట్టి, అతని మనసులో వైరాగ్యం చోటుచేసుకోదు, అని వృద్ధ మహారాజు కొంత ఊరట చెందాడు. ఏదో ఒక

సందర్భంలో సర్వార్ధసిద్ధుడు వనాల సౌందర్యాన్ని గురించి విని, విహార యాత్రకు వెళ్లాలన్నాడు. రాకుమారుని మనసు తెలుసుకున్న

మహారాజు, అతడి విహార యాత్రకు ఏర్పాటు చేయిస్తూ, వ్యాధిగ్రస్తులు, అంగహీనులు, వృద్ధులు, మార్గంలో కనబడకుండా ఉండేటట్లు జాగ్రత్త

వహించాడు. అయితే, దేవతలు సర్వార్ధసిద్దునిలో మొక్షేచ్చ కలిగించాలనే సంకల్పంతో, ఒక వృద్ధ మానవుడిని సృష్టించి, అతడి మార్గంలో ప్రవేశ

పెట్టారు. తధాగతుడు రధ సారధిని అతడి గురించి ప్రశ్నించాడు. దైవప్రేరితుడై, రహస్యంగా ఉంచాలని తెలిసినా, సారధి అయిన సూతుడు ఇలా

చెప్పాడు.

 ' రూపస్య హన్త్రీ వ్యసనం బలస్య శోకస్య యోనిర్నిధనం రతీనాం, నాశః స్మ్రుతీనాం రిపురింద్రియాణామేషా జరా నామ యయైష భగ్నః" ౩-౩౦
 
'రూపాన్ని నశిమ్పజేసేది, బలాన్ని పోగొట్టేది, శోకానికి మూలము, ఆనందానికి అంతము, ఇంద్రియాలకు శత్రువు అయినది వృద్ధాప్యం.

అలాంటి వృద్ధాప్యం చేత యితడు ఇలా గావించబడ్డాడు. ' సూతుని మాటలు విన్న తధాగతుడు, తనకు కూడా ఇలాంటి దశ ఏర్పడుతుందా..

అని అమాయకంగా అడుగుతాడు. అవునని చెప్తాడు సూతుడు. రెండవ సారి, ఆర్తిగా అరిచే రోగిని, మూడవసారి మృత శరీరము చూసిన

తదాగాతుడి మనసు వికలమయిపోతుంది. 'వ్యాధి, మరణం తప్పదని తెలిసినా ఈ ప్రజలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు?' అని అడిగాడు.

అప్పుడు సూతుడు ,

 'తతః ప్రణేతా వదతి సమ తస్మై సర్వప్రజానామిదమంతకర్మ , హీనస్య మధ్యస్య మహాత్మానో వా సర్వస్య లోకే నియతో వినాశః" 3 -59

'అందరూ మానవులకు చివరికి జరిగేది ఇదే! అధముడయినా కావచ్చు, మధ్యముడయినా కావచ్చు, లేక మహాత్ముడయినా కావచ్చు.

అందరికీ వినాశం అనేది నిశ్చయం..''

మరల ఒకనాడు స్నేహితులతో విహారానికి వెళ్ళిన రాకుమారుడికి ఒక దైవపురుషుడు భిక్షువేశంలో తారసపడ్డాడు. 'ఎవరు నీవని' అడిగిన

బుద్ధుడితో, 'నేను జరామరనభాయంతో సన్యసించిన భిక్షువును, మోక్షమార్గాన్ని అన్వేషిస్తూ తిరుగుతున్నాను' , అని చెప్పి ఆకాశానికి

ఎగిరిపోయాడు. అతని మనసులో మొక్షేచ్చ బలంగా నాటుకుపోయింది. తపోవనానికి వెళ్ళడానికి తండ్రి నిరాకరించడంతో, రాత్రికి

రాత్రే చెప్పకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు.. 'అభినిష్క్రమణం ' అనబడే ఈ ప్రధాన ఘట్టంలో, ప్రగాడ మోక్షేచ్చతో సర్వార్ధసిద్ధుడు,

అర్ధరాత్రి తపోవనాలకు బయలుదేరతాడు. అతని మనసులోని ఆలోచన గ్రహించిన దేవతల చేత భావన ద్వారం తెరువబడింది. ఇదే

సన్నివేశాన్ని జంధ్యాల
పాపయ్య శాస్త్రి గారు అత్యంత మనోజ్ఞంగా ఇలా వర్ణించారు...

 

 "ఈ ప్రగాడ నిగూడ మధ్యే నిశీధి, గడియ కదిలించుచున్న సవ్వడి ఇదేమి? ఇంత యర్ధరాత్రమున ఎవ్వారు వారు? మూసియున్నట్టి

 

తలుపులు తీసినారు?"

తన అనుచరుడయిన చంధకునితో ఉత్తమాశ్వాన్ని అధిరోహించి బయలుదేరిన రాకుమారుని నిర్గామానికి దేవతలు అశ్వాపు డెక్కల సవనం
 
 బయటకు వినిపించకుండా, అదృశ్య రూపంలో ఉండి సహాయం చేసారు. భార్గావాశ్రమానికి చేరుకున్న రాకుమారుడు తన ఆభరణాలను

త్యజించి, కాషాయామ్బరాలకై చూస్తుండగా, దేవతలచే పంపబడిన ఒక కిరాతుడు, తాను ధరించిన కాషాయామ్బరాన్ని గౌతముడికి ఇచ్చి,

అతని శ్వేత వస్త్రాలను తీసుకుని అంతర్ధానమయ్యాడు. తన కోసం బాధ పడుతున్న చందకుడిని, అశ్వాన్ని అనునయించి, 'జనన

మరణాల అంతం తెలుసుకునే దాకా నేను కపిలవస్తు నగరంలో కాలు మోపను' అని ప్రతజ్ఞ చేసాడు. ఆశ్రమంలోని వృద్ధ ముని ద్వారా,

వింధ్యకోష్టంలోని ' అరాట్ ' అనే మునిపున్గవుడు తనకు మార్గోపదేశం చెయ్యగలడని తెలుసుకుని, అక్కడకు ప్రయాణమయ్యాడు. దారిలో

 మగధరాజయిన 'బింబ సారుడిని' కలుస్తాడు. ఇరువురూ మిత్రులయ్యి, శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంత చిన్న వయసులోనే, మోక్షం

పట్ల తపనతో వచ్చినా గౌతముడిని చూసి, 'అరాట్' ముని ఆశ్చర్యపోతాడు. ముని కపిల మహర్షిని స్మరించి, అనేక ధ్యాన, యోగ,

సమాధులను గురించిన విషయాలు వివరిస్తాడు. అంతటితో తృప్తి చందక 'ఆత్మ భావన' ను అన్వేషిస్తూ, గయా దగ్గరి 'నగరి' అనే ఆశ్రమానికి

 చేరుతాడు. అక్కడ ఆరు సంవత్సరాలు నిరాహారియై కటిన తపస్సు చేసాడు. క్రమంగా ఉపవాసాదుల వల్ల మోక్షప్రాప్తి కలుగదు అని గ్రహించి,

ఆహారాన్ని స్వీకరించాలనుకున్నాడు. అదే సమయంలో దైవ ప్రేరితయై 'నంద బాలా' అనే గోపబాలిక గౌతముని వద్దకు పాయసాన్ని

తీసుకువచ్చింది. అశ్వద్ధ వృక్ష మూలంలో కూర్చున్నా గౌతముడిని 'కాలం' అనే ఉత్తమ సర్పం వచ్చి దీవిస్తుంది. బుద్ధుడు ఒక విశిష్ట

భంగిమలో ఆసీనుడై, సమాధి నిష్టుడయ్యాడు.

'మార విజయం' అనబడే పదమూడవ సర్గలో, బుద్ధుడి ఇంద్రియ జయాన్ని గురించి వివరిస్తాడు అశ్వఘోషుడు.

"యమ కామదేవం ప్రవదంతి లోకే చిత్రాయుధం పుష్పశరం తధైవ,

కామప్రచారాదిపతిం తమేవ మోక్షద్విషం మారముదాహరాంతి"

ఎవరినయితే లోకంలో 'కామదేవుడు' చిత్రమయిన ఆయుధం కలవాడు, పుష్పబాణుడు అంటారో, మోక్షానికి శత్రువయిన అతనిని

ముముక్షువులు 'మారుడు' అంటారు. ఒకేసారి అరిషడ్వర్గాలను జయించిన మహావీరుడు బుద్ధుడు. ఇక ఒక్కో మెట్టే అధిగమించి,

తత్వదర్శనానికై ముందుకు సాగుతాడు, వివిధ లోకాలు దర్సిన్చగలుగుతాడు. పరమార్ధం తెలుసుకున్న బుద్ధుడు సర్వజ్ఞాత్వాన్ని

 పొందుతాడు. 'బాహ్య మయిన కాని, అంతరమయిన కాని ఆత్మ అనేది లేదు. అష్టాంగ మార్గం ద్వారా శాంతి లభిస్తుంది...' అనేది అతడు

తెలుసుకున్న సత్యం. బుద్ధత్వాన్ని పొందిన అతడిని, మునులు, దేవతలు ప్రశంసిస్తారు. దిక్పాలకులు అతడికి భిక్షాపాత్ర ఇచ్చి సత్కరిస్తారు.

ఇద్దరు శ్రేష్ఠులు భిక్ష ఇస్తారు. ఇక 'బోధిసత్వుడు' కాశి నగరం వైపు తన ప్రయాణం కొనసాగించాడు...

అశ్వఘోష కృత 'బుద్ధ చరితం' సమాప్తం.


 

శిరా కదంబం

మిత్రులారా,

జిల్లెళ్ళమూ డి అమ్మవారి మీద నేను రాసిన వ్యాసం క్రింది లింక్ లో చదవగలరు. శ్రీ రావు గారికి ధన్యవాదాలతో...
https://sites.google.com/site/siraakadambam/devotional/untitledpost


ఈ వారం 'శిరా కదంబం' లో వచ్చినా నా కవిత క్రింది లింక్ లో చదవగలరు.
ధన్యవాదాలు.
https://sites.google.com/site/siraakadambam/literature/okkasarimadhumuralimrogincavu-padminibhavaraju

  • 'శిరా కదంబం' అంతర్జాల పత్రికలో నా వ్యాసం చదవడానికి క్రింది లింక్ ఉపయోగించగలరు. శ్రీ రావు గారు ఈ పత్రికలో నా పై నమ్మకంతో, నాకు ప్రత్యేకంగా , వారం వారం ఒక శీర్షికను ఇచ్చినందుకు ధన్యవాదాలతో..
    https://sites.google.com/site/siraakadambam/samajikam/vyangyavicikaantarjalamarjalam-padminibhavaraju

    ఈ వారం 'వ్యంగ్య వీచిక' శీర్షిక- శిరా కదంబం లో నా వ్యాసం-ఆధునికత క్రింది లింక్ లో చదవగలరు.
    ధన్యవాదాలు.
    https://sites.google.com/site/siraakadambam/samajikam/vyangyavicikaadhunikata-padminibhavaraju


    ఈ వారం 'శిరా కదంబం' అంతర్జాల పత్రికలో నా శీర్షిక 'వ్యంగ్య వీచిక' వ్యాసం---కరెంట్ కష్టాలు క్రింది లింక్ లో

    చదవగలరు... పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోగలరు... ధన్యవాదాలతో.. మీ పద్మిని.

    https://sites.google.com/site/siraakadambam/samajikam/vyangyavicikakarentukastalu-padminibhavaraju



     

    హిమాలయ జీవనం

     



    హిమాలయ జీవనం 





    ఎప్పుడయినా, కోపం వస్తే, 'ఇదిగో, నేను కాశికో, హిమాలయాలకో, వేలిపోతా,జాగ్రత్త!'అని బెదిరిస్తున్టాము కదా, 

    ఇది చదివాకా నాకు అంత అదృష్టం అసలు వస్తుందా అనిపించింది. శ్రీ స్వామి రామ గారి ' హిమాలయ పరమ


    గురువులతో జీవనం' పుస్తకం చదువుతున్నాను. ఈయన హిమాలయాల్లో పుట్టి పెరిగారు. ఇక్కడి అందమయిన 

    ప్రకృతి, ప్రజల స్వచ్చత, నాకెంతో నచ్చింది. సంక్షిప్తంగా, మీరూ చదవండి.

    హిమాలయ (హిమ- మంచు, ఆలయం- స్వగృహం) అనే పేరు సంస్కృతం నుంచి వచ్చింది. ఈ సాటి లేని ప్రాచీన 

    పర్వతాలు, విందామన్న కుతూహలం ఉన్న వాళ్లకి తమ ఆధ్యాత్మిక వైభవాన్ని రహస్యంగా వినిపిస్తుంటాయి. 

    హిమాలయాలు నా ఆధ్యాత్మిక తల్లిదండ్రులు. భయరహితుడనై, గుహలు, సెలయేరులు, పర్వత దారులు, 

    ఎత్తయిన శిఖరాలు, నిషేధించిన ప్రాంతాలు, అన్నిటా ప్రయాణించాను. ఇక్కడి జ్ఞానులు, సాధువుల వద్ద నేను

    నేర్చుకున్న అమూల్య విషయం, ప్రకృతి పట్ల ప్రేమ, ప్రాణుల పట్ల ప్రేమ, అందరి పట్ల ప్రేమ. వారి సిద్ధాంతం- ప్రకృతి 

    పట్ల అవగాహన. ఆత్మను చలిమ్పజేసే, హిమాలయాలలోని వికసించే పుష్పాల నుంచి వచ్చే సంగీతాన్ని, పక్షుల 

    సంగీతాన్ని,గంగానది సవ్వడిని, ఎండుటాకుల గల గలల్ని, మానస సరోవరం లోని నీటి స్వచ్చతని, మంచుతో 

    కప్పబడ్డ పూల పాన్పులని, లిల్లిలు, ఆర్కిడ్లు , పెద్ద మంచు గడ్డలు,జలపాతాల మంచు ప్రవాహాలు, అన్నిటిలో నా 

    ఆత్మ ఐక్యమై, లయమై కదిలింది. మంచు కొండలు ఉదయం వెండిలా, మధ్యానం బంగారంలా, సాయంత్రం ఎర్రగా, 

    రంగులు మార్చుకుంటూ,ఉంటాయి. ఉదయం ప్రశాంతంగా, అన్వేషకుల్ని మౌనం లోకి వెళ్లేటట్టు చేస్తుంది. 

    సాయంత్రం లక్షలాది రంగుల్ని అసమాన చిత్రకారుడయిన దేవుడు, హిమ శిఖరాలపై వేదజల్లినట్టు ఉంటుంది. 

    రాత్రి వేళల్లో వికసించే కొండ జాతి ముళ్ళ మొక్కలు, హిం కమల్ పరిమళాలు, వెన్నెల్లో వెండిలా మెరిసే సెలయేటి 

    గట్లు, హృదయ భాష తో తప్ప ఆ సౌందర్యాన్ని వర్ణించడం సాధ్యం కాదు. మనసుకు ప్రకృతిని ప్రేమించడంలో 

    శిక్షణ తప్పక ఇవ్వాలి. ఎప్పుడయితే వ్యక్తి ప్రకృతి నిరాడంబరత లోని లోతుల్ని పూర్తిగా గ్రహించి ఆనందించడం 

    నేర్చుకుంటాడో, అప్పుడు ఆత్మ యొక్క తేజం బహిర్గతమయ్, అన్నీ అవరోధాలు తొలగిపోతాయి. ప్రకృతి మాత 

    స్వయంగా జాగ్రుతులవ్వడానికి తోడ్పడుతుంది. నిశ్శబ్దపు అంతరంగం లోని ప్రేమ సుమం వికసిస్తుంది.

    ప్రకృతి చాలా ప్రశాంతమయినది. తమను తాము కలత పెట్టుకునే వాళ్ళని, ఆమె కలవరపెడుతుంది. తన 

    సౌందర్యాన్ని ఆరాధించి, అభినందించేవారికి, ఆమె వివేకాన్ని బోధిస్తుంది. బౌద్ధ సంస్కృతి హిమాలయాల్లో పుట్టి, 

    టిబెట్, చైనా, జపాన్ లో ప్రవేశించి, వారందరినీ సుసంపన్నం చేసింది. ఇక్కడి 'హంస' సమాజం వారు 

    శాఖాహారులు. పాలు- నీరు ఎలా హంస విడదీస్తుందో, వీరికి మంచిని ఎంచుకుని, చెడును వదిలేసే తెలివి ఉంది. 

    ఆధునికుల దృష్టిలో, ఇక్కడి గ్రామాలు విద్య, సాంకేతిక, వైద్య రంగాల్లో వెనుకబడి ఉన్నాయి. ప్రకృతిని 

    నాగరీకరించి, ప్రకృతి స్పర్సకి, వాస్తవానికి, దూరమవడం వీరు ఇష్టపడరు. బార్లీ, గోధుమ, పశు సంపద, వీరి

    జీవనాధారాలు. వీరికి దురాశ, భౌతిక సంపదలపై పిచ్చి లేదు. ఇక్కడి ప్రజలు, 'దోపిడీ లేకుండా మమ్మల్ని 

    వదిలెయ్యండి, దూరం నుండే మా పై గౌరవం, కృతజ్ఞత చూపండి', అంటూ, నిజాయితీగా ఉండడానికి 

    ఇష్టపడతారు. ఎవరయినా కనిపిస్తే, వారు అడిగే ప్రశ్న, 'మీరు భోజనం చేసారా? ఉండడానికి చోటుందా?',అని. 

    ఎంతటి పెదలయినా పెద్ద మనసుతో, సుఖ సంతోషాలతో ఉంటారు. ఆధునికులు కృత్రిమ ముత్యాలయితే, వీరిది

    నిజమయిన మేలి ముత్యాల స్వచ్చత, మెరుపు. ఇక్కడి జీవనం ప్రశాంత మానస సరోవరమాధుర్యం .

    అశ్వఘోషుడు




    అశ్వఘోషుడు

    సంస్కృత వాన్గ్మయంలో కాళిదాసు వంటి కవుల సరసన పీటం వేయదగిన మహాకవి అశ్వఘోషుడు. బుద్ధుడి 

    జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని, యితడు రచించిన రెండు మహా కావ్యాలు 'సౌందరనందం', 'బుద్ధచరితం'. 

    అశ్వఘోషుడు 'మగధ' రాజ్యంలో ఉండేవాడు. రాజు తన ఆస్తానంలోని మిగతా కవులకు, అశ్వఘోషునిపై ఉన్న 

    మాత్సర్యం గమనించి, వారికి అశ్వఘోషుని వైశిష్ట్యం తెలియ చెప్పాలని, తన అశ్వశాల లోని అశ్వాలకు ఒక 

    రోజంతా ఆహారం ఇవ్వకుండా మరునాడు వాటి ముందు ఆహారం ఉంచి, అశ్వఘోషుడిని పద్యాలు

    చదవమన్నాడట. అశ్వఘోషుడు వాటిని పటించడం మొదలు పెట్టగానే, ఆ గుర్రాలన్నీ ఆహారం ,ముట్టకుండా 

    కళ్ళలో నీళ్ళు నింపుకున్నాయట. ఆ నాటి నుండి అతడి పేరు 'అశ్వఘోషుడిగా' ప్రచారమయ్యింది. కనిష్కుడు 

    మగధ రాజుపై దండెత్తి, ఆ రాజును వాదించి, అతనితో బుద్ధుడి అస్తికలను, అశ్వఘోషుడిని తనకు 

    సమర్పించాలని అడిగాడట. అది విని మగధ రాజు, అస్తికలను ఇవ్వడానికి వప్పుకున్నాడు కాని, అశ్వఘోషుడిని 

    వదలడానికి ఇష్టపడలేదట.

    అశ్వఘోషుడు వైదీక ధర్మావలంబి. బౌద్ధ ధర్మ విరోధి. మగధ నగరంలో ఒక గంట  వేలాడదీయించి, తనతో 

    వాదంలో గెలిచిన వారు తప్ప ఎవరూ దానిని తాకరాదని ఆంక్ష విధించాడట. ఒక నాడు 'పార్స్వుడు' అనే బౌద్ధ 

    మత గురువు వచ్చి, అతనిని ఒక ప్రశ్న అడిగాడు...

    " ఈ ప్రపంచంలో శాంతి, సమ్రుద్ధమయిన స్థిరమయిన రాజ్యము, ప్రజలు దుఖానికి గురి కాకుండా ఉండడము-- 

    ఇవి కావాలంటే, ఏమి చెయ్యాలి?" ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని అశ్వఘోషుడు, అతడి శిష్యుడయ్యాడు . ఆ 

    తరువాత బౌద్ధ మత ప్రచారానికి పూనుకున్నాడు. కనిష్కుడు అతనికి తన ఆస్థానంలో ఉన్నత స్థానం 

    కల్పించాడు. బౌద్ధ మత గ్రంధాలలో అశ్వఘోషుని పేరు స్మరించబడుతుంది. ఈ కావ్యాలలో ఇతిహాస, పురాణాల

    లోంచి ఉదాహరణలు బహుళంగా కనిపిస్తాయి. స్వర్గం, దేవ లోకం, దేవ పురుషులు ఇత్యాదులు వర్ణించబడ్డాయి. 

    భారతీయ తత్వ శాస్త్రాన్ని తెలిసిన మహా దార్సనీకుడు 'అశ్వఘోషుడు' బుద్ధుని జ్ఞాన పిపాస పట్లా, అహింసా 

    వాదం పట్లా ప్రభావితుడై బౌద్ధ మతాన్ని సమర్ధించాడు. ఇతని సుకుమారమయిన శైలిని చూసి, కాళిదాస,

    అశ్వఘోషులలో ఎవరు ఎవరి వల్ల ప్రభావితం అయ్యారు-- అనే ప్రశ్న ఉదయిస్తుంది.

    భక్త జయదేవుడు

    

    భక్త జయదేవుడు 

    కొంత మంది పుట్టుకతోనే భక్తులై, జ్ఞానులై ఉంటారు. 13 వ శతాబ్దానికి  చెందిన, వ్యాసుని అవతారంగా భావించే '
    జయదేవుడు' ఇటువంటి వారిలో ఒకరు. ఈయన  జీవితం, పూర్ణ భావంతో, భక్తీ విశ్వాసాలతో, సాధన చేస్తే,
    భగవంతుడే, అనేక  రూపాల్లో వచ్చి రక్షిస్తాడని, తెలియజేస్తుంది. బాల్యంలోనే ,ఆశుకవిత్వం చేప్పారు,
    ఏకసంధాగ్రాహి , జగన్నాధుని భక్తుడు. ఈయన కీర్తనలు పాడుతుంటే, జగన్నాధ స్వామి లీలలన్ని, కళ్ళకు కట్టినట్టు
    కనిపించడంవల్ల, బహుళ ప్రజాదరణ పొంది, ప్రతి నోటా, వినిపించసాగాయి. జగన్నాధుని భక్తుడయిన కళింగ రాజు,
    తన పాటలను కాక, జయదేవుడి పాటలు ఎక్కువ ప్రాచుర్యం పొందడం సహించలేక, పండితుల సలహాతో, ఇరువురి
    కీర్తనలను ఒక రాత్రి, జగన్నాధుని గుడిలో ఉంచుతాడు. ఉదయానికి, రాజుగారి గ్రంధం ముక్కలుముక్కలయ్యి
    ఉండడం చూసి, అభిమానపడి, ప్రాణత్యాగం చెయ్యబోతాడు. అప్పుడు జగన్నాధుని విగ్రహం లోనుంచి,
    'రాజా! మీ ఇద్దరి కవితలూ గొప్పవే, ఈర్ష తో, అధికార బలంతో, నువ్వు ప్రవర్తించడం వల్ల, నీ కీర్తనలు నేను
    స్వీకరించలేదు, ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి కనుక, నీ పాటలను కూడా కొన్నిటిని స్వీకరిస్తున్నాను,' అన్న
    మాటలు వినిపించాయి.

    జయదేవుని భార్య పద్మావతి, అతని కవితా స్పూర్తి. ఆయన రాసిన గీతాలను, నాట్యంతో, చక్కగా అభినయించి
    చూపేది. ఆ మహా భక్తుని, భార్యగా ఉండడం గొప్ప అదృష్టంగా భావించిన మహాపతివ్రత. ఒక సారి, జయదేవుడు
    ప్రక్క ఊరిలో,భాగవత సప్తాహం చేసాడు. ప్రతిఫలం ఆశిన్చడని తెలిసిన షావుకారు, నలుగురు సేవకులతో,
    మణిమాణిక్యాలు, బంగారం, రహస్యంగా, ఆయన వెంట వెళ్లి, పద్మావతికి ఇచ్చిరమ్మని పంపాడు. ఆ నలుగురు
    సేవకులూ, స్వార్ధంతో కుమ్మక్కయ్యి, జయదేవుడి, కాళ్ళు-చేతులు నరికేసి, ఒక పాడుబడిన బావిలో పడేసారు. ఆ
    దారిలో వెళుతున్న వింధ్య రాజు, బావిలోంచి, 'కృష్ణా! కృష్ణా!' అన్న మాటలు విని, ఆయనను బయటకు
    తీయిన్చేసరికి, లీలగా, ఆయన కాళ్ళు- చేతులు తిరిగి వచ్చేసాయి. ఆ రాజు జరిగింది తెలుసుకుని, సంతోషించి, తన
    రాజ్యంలో కూడా భాగవత సప్తాహం జరపాలని, ఆయనను పద్మావతీ సమేతంగా తీసుకువెళ్ళాడు. ఆ సప్తాహానికి,
    లోగడ ఆయనను బావిలో పడేసిన నలుగురు దొంగలూ వచ్చారు. భక్తి పారవశ్యంలో ఉన్న జయదేవుడు, వాళ్ళను
    చూడగానే, హటాత్తుగా వెళ్లి, కౌగిలించుకున్నాడు. వాళ్ళను సత్కరించి పంపాల్సిందిగా, రాజుకు చెప్పాడు. అయితే,
    వెళ్ళే దారిలో, వాళ్ళు మట్టిలో సగానికి కూరుకుపోయారు. జయదేవుడికి, వారి దీనావస్తకు, దయ కలిగి, 'హే కృష్ణా!
    వీళ్ళను రక్షించు తండ్రి!' అని ప్రార్ధించాడు. భక్తుని మాట మన్నించి, వారిని రక్షించాడు దేవుడు.

    పద్మావతికి, వింధ్య రాణికి మంచి స్నేహం కుదిరింది. ఒక రొజు, రాణి గారు పంతం కొద్దీ, పద్మావతిని పరీక్షించాలని,
    భటుడితో, 'జయదేవుడు, వేటలో పులి బారిన పడి చనిపోయాడని', అబద్ధం చెప్పిస్తుంది. ఆ వార్త వినగానే, ప్రాణాలు
    విడుస్తుంది పద్మావతి. సిగ్గుతో ప్రాయశ్చితం చేసుకోబోయిన రాజ దంపతులను, జయదేవుడు వారించి,ఒక
    అష్టపదిని గానం చేస్తాడు. శ్రీ కృష్ణ పరమాత్మ కరిగిపోయి, పద్మావతిని తిరిగి బ్రతికించాడు. ఈ ఉదంతం,
    అష్టపదులకు ఉన్న మహత్తును, సంజీవిని శక్తిని తెలియజేస్తుంది.

    జయదేవుడు అనగానే, అష్టపదులు గుర్తుకు వస్తాయి. ఈ అష్టపదులు 'గీతగోవింద మహాకావ్యం ' లోనివి. 'జయదేవ
    అష్టపదులలో', 24 అష్టపదులు , ప్రతి ఒక్కటి, ప్రత్యేకమయిన రాగంతో, తాళంతో రచింపబడ్డాయి. ఈ గీతి కావ్యంలో

    మూడే పాత్రలు –
    రాధ, కృష్ణుడు మరియు సఖి. విరహవేదన ఈ కావ్యంలోని విషయం. ఇందులో లౌకికంగా శృంగారం కనిపించినా, ఆధ్యాత్మికతే ప్రధానం. భక్తి శృంగారం ఇందులో ఎంతోమధురంగా కలసిపోయాయి. ఇందులోని సఖి నాయికా-నాయకుల విరహవేదనను పరస్పరం తెలియజేసివారిని సన్నిహిత పరచడానికి ప్రయత్నిస్తూ – ప్రేయసీ ప్రియుల ఆనంద సమాగమానికిదారితీస్తుంది. అష్టపదులలోని అర్ధాలను చక్కగా విశ్లేషణ చేసి, ఆ మహాత్ముడి
    హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.జయదేవుడు దశావతారాల గురించి వ్రాసిన కావ్యం, 'దశకృతికృతే''. కృష్ణుడు మూడుముఖాలతో వేణువు వాయిస్తున్నట్టు వర్ణించే కావ్యం, ''త్రిభంగి'' అతని వల్లే ప్రాశస్త్యము నొందింది. ఫ్రజల గుండెల్లోఅజరామరంగా నిలిచిపోయిన ఆయన యొక్క గీతగోవింద మహాకావ్యం భావికాలంలో నారాయణతీర్ధ
    వంటి మహావాగ్గేయకారులకుస్పూర్తిదాయకమయ్యింది. అంతేకాకుండా అనేకమంది దీనిని ఆంగ్లం, జర్మన్,
    ప్రెంచ్, లాటిన్మొదలైనభాషల్లోకి అనువాదం చేశారు. మొట్టమొదట విలియం జోన్స్ చేసిన ఆంగ్ల అనువాదం
    పెద్ద సంచలనాన్నే కలిగించింది."ఆర్నాల్డ్ సాంగ్ ఆఫ్ సాంగ్" పేరుతో చేసిన ఆంగ్లభావానువాదం చాలా ప్రాచుర్యం పొందింది. గీతగోవింద కావ్యం లోని కొన్ని పద్యాలు, చూద్దామా!

    ''చందన చర్చిత నీలకళేబర
    పీత వసన వనమాలీ
    కేళిచలన్మణి కుండల మందిత
    గండయుగ స్మితశాలీ...''
    ఓ శృంగార భావాలుకల రాధా! గంధం పూసిన నల్లనైన శరీరం మీద పచ్చని వస్త్రంధరించినవాడు , పాదాలవరకు వేలాడే వనమాల ధరించినవాడు అయిన శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు. ఆయనగారు ఆటలు ఆడటం వల్ల చెవులకు పెట్టుకొన్న రత్న కుండలాలు కదులుతున్నాయి . చెక్కిళ్ళమీద ఇంకా ఏమీ ఆభరణాలు అక్కర్లేదు. ఆయన చిరునవ్వులే ఆభరణాలు .

    " నిందతి చందన ఇందు కిరణమను విందతి ఖేద మధీరం.....
    వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరం....
    మాధవ మనసిజ విశిఖ భయాదివ భావనయా త్వయిలీనా.....
    సావిరహే తవదీనా....సావిరహే తవదీనా....."

    కృష్ణుడు లేక రాధ పడుతున్న బాధను వర్ణిస్తూ.....ఆమె చెలి పాడే ఈ గీతం, రాధమనోవేదనను కళ్ళముందు నిలుపుతుంది. 'రాధ విరహం చేత చల్లని వస్తువులయిన గంధాన్నీ, వెన్నెలనీ, మలయమారుతాన్నీ తట్టుకోలేక దూరంగా మసలుకుంటున్నది. ఇవేవీ రాధకి శాంతినివ్వడం లేదు. మన్మధ బాణాల తాకిడికి భయపడిన దీనురాలైన రాధ అనుక్షణమూ నీ భావనలో లీనమై ఉన్నది.'