Sunday, April 8, 2012

వంశి కధలు




వంశి కధలు 
మిత్రులారా,

మనసు అద్దం లాగ ఉంటే, ఎవరి రుపమయినా ప్రతిబింబిస్తుంది. మనసు చిగురుటాకులా ఉంటే, నీరెండయినా, 



వాన చినుకయినా, మంచు బిందువయినా, దాని మీద పడితే, తళుక్కున మెరుస్తుంది. మనసు సెలయేటి నీరు 


అంత స్వచ్చంగా ఉంటే, ఎదుటి మనిషి లోతుల్నిస్పష్టంగా చూపిస్తుంది. రచనలు రచయత మనస్తత్వాన్ని, 


అభిరుచులని వ్యక్తపరుస్తాయి. అలాంటి వెండి మనసు ఉన్న సినీ దర్శకులు, రచయత, సంగీత  దర్శకులు, ఈ 


మధ్యనే పాటలు కూడా పాడిన గాయకులూ, వంశి. ఆయన పసలపూడి కధలకు ప్రేరణ, సీతారాముడు 


మావయ్యగారి గోదావరి కదలట. 'మన్యం రాణి' చదువుతున్నప్పుడు,మనల్ని ఆ అడవుల్లో, అడవి పూలలో, తేట 


మనుషుల్లో విహరింప చేస్తారు. పసలపూడి కధలు, గోదావరి కధలు చదువుతుంటే, మనం కూడా అక్కడే పుట్టి 


పెరిగిన అనుభూతి కలిగిస్తారు. అక్కడి మనుషుల్ని, దృశ్యాలని కళ్ళకు కట్టినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. ఇక 


ఆయన సినిమాల్లోని పాత్రలు సహజంగా, మన చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్లా అనిపిస్తాయి. సహజత్వం, 


నిరాడంబరత్వం, కొంత అమాయకత్వం, మమకారం, ఆప్యాయత ఆయన పాత్రల్లో ప్రతిబింబిస్తాయి. విశ్వనాధ్ 


గారి సహ దర్శకులుగా సినిప్రస్తానం మొదలు పెట్టిన వంశి, తన 'మహల్ లో కోకిల' అనే నవలను 'సితార'


సినిమాగా రూపొందించారు. తరువాత అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలేర్ వంటి  సినిమాలకు 

దర్సకత్వం వహించారు.వంశి 'మా దిగువ గోదావరి కధలు' డౌన్లోడ్ లింక్,
మా పసలపూడి కధలు , కేవలం రెండే కధలు దొరికాయి, డౌన్లోడ్ లింక్స్ ,



వంశితో ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూ చూడడానికి, క్రింది లింక్ ఉపయోగించండి.

http://www.teluguportals.com/2012/02/abn-openheart-with-rk-with-vamsi/

ధన్యవాదములు.

No comments:

Post a Comment