Wednesday, April 11, 2012

గోదావరి కధలు









గోదావరి కధలు 



'జీవితాన్ని సాహిత్యంగా మార్చడం, పచ్చి పాల లోంచి వెన్న తియ్యడం లాంటిది.' ఒక మంచి కధ రాయడానికి 


చాలా సత్తా, ఇంకెంతో మంచితనం కావాలి. పెద్ద మనసుతో రాసిన పెద్ద కధలు, మా సీతారాముడు మావయ్యగారి 


'గోదావరి కధలు.' ఇవన్ని గోదావరి గాలి పీల్చి, గోదావరి నీరు తాగి, బ్రతుకుల్ని పండించుకున్న కధలు. ఒక్కో 


కధ, ఒక్కో మచ్చుతునక. స్వచ్చమయిన గోదావరి నీళ్ళలో ప్రతిబింబించే పున్నమి చంద్రుడిలా,ఒక్కో కధ, 


ఆయా పాత్రల తీరును మన కళ్ళ ముందు ఆవిష్కరిమ్పజేస్తుంది. ఈ కధల గురించి వారి మాటల్లో,

'ప్రవాహంలో తరంగాల్లా, ఎన్నో జీవితాలు కాల ప్రవాహంలో సాగిపోతుంటాయి.తరంగానికి దిగువన మనకు 


కనబడని మరో తరంగం ఉంటుంది. ఆ తరంగ శక్తే, మనకు కనబడే తరంగాన్నినడిపిస్తుంది. అలాగే మనమేరిగిన 


వ్యక్తుల జీవితాల వెనుక మనమేరుగని ఎన్నో నిజాలు దాగి ఉంటాయి. అలా సాగే కధలకు పారే గోదావరే సాక్షి.'

చక్కటి హృద్యమయిన ఈ కధలను చదవడానికి, డౌన్లోడ్ చేసుకోడానికి, కింది లింక్ ను


ఉపయోగించండి.


No comments:

Post a Comment