Saturday, September 8, 2012

తిరుపతి వేంకట కవులు


దివాకర్ల తిరుపతి శాస్త్రి 
చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి 


*దివాకర్ల తిరుపతి శాస్త్రి* (1872-1919) మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని

జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.

 వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి

పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ

ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.

బావా ఎప్పుడు వచ్చితీవు..,

చెల్లియో చెల్లకో..,

జెండాపై కపిరాజు..

వంటి పద్యాలు ఆరంభ పదాలు తెలియని తెలుగువారు అరుదు .మొదటినుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక

వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు

చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి

స్నేహాన్ని బలపరచింది.

వేంకట శాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగి వచ్చాకా , కాకినాడ లో జంటగా శతావధానం ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు

ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి

తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.

ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు

అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను

ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.

కవులకు మీసా లెందుకు .? అని ఎవరొ ఆ క్షేపిం చగా , తెలుగు లోను సంస్కృతం లోను మమల్ని మించిన వారెవరైనా ఉంటే , మీసాలు తీసి

మొక్కుతామని సవాలు చేస్తూ చెప్పిన పద్యం చూడండి

దోస మటం చెరింగియు దుందుడు కొప్పగ పెంచి నారమీ

మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా

రోసము కల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ

మీసము దీసి మీ పద సమీపములం దలుంఛి మ్రొక్కమే !

అంటూ చమత్క రించారు .

ఇకపోతే మనందరి నోటా నిరంతరము పలికెడి పద్యాలు " పాండవోద్యోగ విజయం లోనివి.

బావా ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్

నీవాల్ల భ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖో పెతులే

నీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ

దేవుల్ సేమంబై నెసంగుదురె ? నీ తేజంబు హెచ్చిం చున్ .

No comments:

Post a Comment