Saturday, September 8, 2012

పోతన పద్యం

  


పోతన పద్యం 
 



చక్కటి పోతన పద్యాలు చూద్దామా,

మందార మకరంద మాధుర్యమునదేలు మధుపమ్ము పోవునే మదనములకు?

నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు?

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు?

పూర్ణేందు చంద్రికా స్పురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు?

అమ్బుజోద్భవ దివ్య పాదారవింద చిన్తానామృత పాన విశేషమత్త ,

చిత్తమేరీతి నితరంబు చేర నేర్చు? వినుతగుణ శీల మాటలు వేయునేల?

తాత్పర్యము:

మందార మకరందముల తీపి మరిగిన తుమ్మెద ఉమ్మెత్త పూలు చేరుకుంటున్దా ? ఆకాశ గంగా తరంగాలలో ఉయ్యాలలూగే రాజహంస

వాగులకు, వంకలకు వెళుతుందా?

తీయని లేత మామిడి చిగురులు తిని, పరవశించే కోయిల కొండ మల్లెలను కోరుతుందా?

పండు వెన్నెల బయళ్ళలో విహరించే చకోరం మంచు పోగల వైపు పోతుందా?

భగవంతుడి పాదాలను భజించడంలో మత్తెక్కిన చిత్తానికి, మరో చింత ఉంటుందా? వెయ్యి మాటలు ఎందుకు? పరమాత్ముని వలచిన మనసు

మరో వైపుకు చేరుకోదు.

No comments:

Post a Comment