కాళిదాసు ఉపమానాలు
* 'ఉపమా కాళిదాసః ' **... అన్నారు కదండీ, అలాంటి కొన్ని కాళిదాసు ఉపమానాలు చూద్దామా...
'రఘువంశము' కావ్యంలో అజ మహారాజు, విదర్భ రాజు చేల్లెలయిన 'ఇందుమతి' స్వయంవర సభకు వెళ్ళిన ఘట్టం ఇలా వర్ణిస్తారు.
'సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా,
నరెంద్రమార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం స స భూమిపాలః'
తాత్పర్యము: ఆయా దేశాల నుండి వచ్చిన రాజకుమారులంతా ఉన్నతాసనాల మీద కూర్చున్నారు. ఇందుమతి తమ వద్దకు రానంతవరకూ,
ప్రతి ఒక్కడూ ఆమె తననే వరిస్తుందనే ఆశతో, ప్రకాసవంతమయిన ముఖంతో కూర్చున్నాడట. ఆమె తమను దాటి వెళ్ళిపోగానే వారి
ముఖాలు వివర్నమావుతున్నాయట. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి కాగడా పట్టుకుని, రాజ వీధిలో నడుస్తుంటే, ఆ కాగడాకి ఎదురుగుండా
ఉన్న భవనం కాంతివంతంగా ఉంటుంది. కాగడా భవనాన్ని దాటి వెళ్ళిపోగానే, పెద్ద చీకటి ఆ భవనాన్ని ఆక్రమిస్తుంది. అలా ఉందట
రాకుమారుల పరిస్థితి.
ఈ ఉపమానమే కాలిదాసుకు 'దీపశిఖా కాళిదాసు' అనే బిరుదాన్ని ఇచ్చింది.
'అభిజ్ఞాన శాకుంతలం ' లో శకుంతలను చూసిన దుష్యంతుడు ఇలా అనుకుంటాడు...
" ఇదం కిలావ్యాజమనోహరం వపుహు తపహక్షమం సాధయితుం య ఇచ్చతి
ధృవం స నీలోత్పల షత్రధారయా సమిల్లతాం ఛేత్తు మ్రుషిర్వ్యవస్యతి"
తాత్పర్యము: అసలు సహజ సౌందర్యమే ఉండాలి కాని ఎలాంటి బట్ట కట్టినా బాగుంటుంది. చంద్రునికి మచ్చ కూడా ఒక అందమే! ఈమె నార
చీర కట్టినా అందంగా ఉంది."
'రఘువంశము' కావ్యంలో అజ మహారాజు, విదర్భ రాజు చేల్లెలయిన 'ఇందుమతి' స్వయంవర సభకు వెళ్ళిన ఘట్టం ఇలా వర్ణిస్తారు.
'సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా,
నరెంద్రమార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం స స భూమిపాలః'
తాత్పర్యము: ఆయా దేశాల నుండి వచ్చిన రాజకుమారులంతా ఉన్నతాసనాల మీద కూర్చున్నారు. ఇందుమతి తమ వద్దకు రానంతవరకూ,
ప్రతి ఒక్కడూ ఆమె తననే వరిస్తుందనే ఆశతో, ప్రకాసవంతమయిన ముఖంతో కూర్చున్నాడట. ఆమె తమను దాటి వెళ్ళిపోగానే వారి
ముఖాలు వివర్నమావుతున్నాయట. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి కాగడా పట్టుకుని, రాజ వీధిలో నడుస్తుంటే, ఆ కాగడాకి ఎదురుగుండా
ఉన్న భవనం కాంతివంతంగా ఉంటుంది. కాగడా భవనాన్ని దాటి వెళ్ళిపోగానే, పెద్ద చీకటి ఆ భవనాన్ని ఆక్రమిస్తుంది. అలా ఉందట
రాకుమారుల పరిస్థితి.
ఈ ఉపమానమే కాలిదాసుకు 'దీపశిఖా కాళిదాసు' అనే బిరుదాన్ని ఇచ్చింది.
" ఇదం కిలావ్యాజమనోహరం వపుహు తపహక్షమం సాధయితుం య ఇచ్చతి
ధృవం స నీలోత్పల షత్రధారయా సమిల్లతాం ఛేత్తు మ్రుషిర్వ్యవస్యతి"
తాత్పర్యము: అసలు సహజ సౌందర్యమే ఉండాలి కాని ఎలాంటి బట్ట కట్టినా బాగుంటుంది. చంద్రునికి మచ్చ కూడా ఒక అందమే! ఈమె నార
చీర కట్టినా అందంగా ఉంది."
కాళిదాసు 'మేఘ దూతం' కావ్యం లోని ఉపమానాలు...
కుబేరుని శాపం వల్ల కలిగిన ప్రియావిరహంతో బాధపడుతున్న ఒక యక్షుడు
తెలియకుండా ఎలా ప్రయాణించాలో చెబుతాడు. మేఘుడు అలకాపట్టణం చేరేలోపుగా నదులు, పర్వతాలు, పట్టణాలు మొత్తం
ఇరవైనాలుగింటిని అతిమనోహరంగా వర్ణించారు-- కాళిదాసు.
ఉజ్జయిని నగరం మేఘుడు ప్రయాణించే దారిలో లేదు. అయినా తన నివాస నగరం మేఘునికి చూపించాలనే ఉద్దేశంతో ఆ మేఘుడిని అక్కడికి
కూడా పంపుతారు కాళిదాసు. 'సంధ్యాకాలం కంటే ముందుగానే ఉజ్జయినిలో ఉన్న మహాకాలేస్వరుని సన్నిధి చేరుకున్న, సంధ్యాకాలం వరకు
అక్కడే ఉండు. సంధ్యా పూజ సమయంలో నీ ఉరుముల ధ్వనితో ఈశ్వరుని సేవించి, సాఫల్యాన్ని పొందు... ఈశ్వరుని సేవించే అవకాశం
దొరికినప్పుడు విడువకూడదు కదా!
"అపయన్యస్మిన్ జలధర మహాకాలమాసాద్య కాలే ,స్తాతవ్యం తే నయనవిషయం యావదత్యేతి భానుహు
కుర్వన్ సంధ్యాబలిపటహతాం శులినః శ్లాఘనీయా, మామంద్రాణాం ఫలమవికాలం లప్స్యసే గర్జితానాం ||"
'మనుష్యులు ఒకరికొకరు దూరం అవడం తోటే, స్నేహం సన్నగిల్లుతుందని అంటారు. అది ఇతరుల విషయంలో వాస్తవం అయితే
కావచ్చునేమో కాని అత్యంత ప్రేమాస్పదులయిన దంపతుల విషయంలో ప్రేమ రోజురోజుకూ పేరుకొనిపోయి, ప్రేమ రాశిగా ఏర్పడుతుంది.'
"స్నేహానాహుహు కిమపి విరహే ధ్వంసినః తే త్వభోగా దిశతే వస్తున్యుపరిచితరసః ప్రేమరాశీభవన్తి"
మేఘుడిని పొగిడి, కార్యోన్ముఖుడిని చేసి, తన సందేశం అందించమనడంలో, కవి చాతుర్యం క్రింది వర్ణనల ద్వారా తెలుస్తుంది....
'ఉత్తముల ధర్మం ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడమే కదా!
ఓ మేఘుడా! నీ హృదయం నిండా ఆర్ద్రత ఉంది, సాధారణంగా ఇటువంటి వారు జాలి కలవారై ఉంటారు కదా!
అక్కడా ఇక్కడా విశ్రాంతి తీసుకుంటూ నా సంగతి మర్చిపోతావేమో మేఘుడా! పని చేసి పెడతామన్న మాట ఇచ్చిన వాళ్ళు ఆలస్యం చెయ్యరు
కదా!
ఓ మేఘుడా! నా ప్రేయసీ కనపడగానే, మొదట 'నీ భర్త క్షేమంగా ఉన్నాడు', అని చెప్పు. ముందుగా చెప్పవలసినది క్షేమ వార్తే కదా!
కుబేరుని శాపం వల్ల కలిగిన ప్రియావిరహంతో బాధపడుతున్న ఒక యక్షుడు
రామగిర్యాశ్రమంలో (మధ్య ప్రదేశ్ ప్రాంతంలోని రామటేక్)
సంచరిస్తూ, ఒక మేఘం ద్వారా ప్రియురాలికి సందేశం పంపడం ఇందులోని ఇతివృత్తం. మేఘుడిని ప్రసన్నం చేసుకోవడానికి పుష్పాలతో
పూజించి, అతడిని స్తుతిస్తాడు. తరువాతా రామగిరి నుంచి-- అలకా పట్టణం చేరవలసిన మార్గం సవిస్తరంగా వర్ణించి చెబుతూ, మేఘుడు శ్రమ
తెలియకుండా ఎలా ప్రయాణించాలో చెబుతాడు. మేఘుడు అలకాపట్టణం చేరేలోపుగా నదులు, పర్వతాలు, పట్టణాలు మొత్తం
ఇరవైనాలుగింటిని అతిమనోహరంగా వర్ణించారు-- కాళిదాసు.
ఉజ్జయిని నగరం మేఘుడు ప్రయాణించే దారిలో లేదు. అయినా తన నివాస నగరం మేఘునికి చూపించాలనే ఉద్దేశంతో ఆ మేఘుడిని అక్కడికి
కూడా పంపుతారు కాళిదాసు. 'సంధ్యాకాలం కంటే ముందుగానే ఉజ్జయినిలో ఉన్న మహాకాలేస్వరుని సన్నిధి చేరుకున్న, సంధ్యాకాలం వరకు
అక్కడే ఉండు. సంధ్యా పూజ సమయంలో నీ ఉరుముల ధ్వనితో ఈశ్వరుని సేవించి, సాఫల్యాన్ని పొందు... ఈశ్వరుని సేవించే అవకాశం
దొరికినప్పుడు విడువకూడదు కదా!
"అపయన్యస్మిన్ జలధర మహాకాలమాసాద్య కాలే ,స్తాతవ్యం తే నయనవిషయం యావదత్యేతి భానుహు
కుర్వన్ సంధ్యాబలిపటహతాం శులినః శ్లాఘనీయా, మామంద్రాణాం ఫలమవికాలం లప్స్యసే గర్జితానాం ||"
'మనుష్యులు ఒకరికొకరు దూరం అవడం తోటే, స్నేహం సన్నగిల్లుతుందని అంటారు. అది ఇతరుల విషయంలో వాస్తవం అయితే
కావచ్చునేమో కాని అత్యంత ప్రేమాస్పదులయిన దంపతుల విషయంలో ప్రేమ రోజురోజుకూ పేరుకొనిపోయి, ప్రేమ రాశిగా ఏర్పడుతుంది.'
"స్నేహానాహుహు కిమపి విరహే ధ్వంసినః తే త్వభోగా దిశతే వస్తున్యుపరిచితరసః ప్రేమరాశీభవన్తి"
మేఘుడిని పొగిడి, కార్యోన్ముఖుడిని చేసి, తన సందేశం అందించమనడంలో, కవి చాతుర్యం క్రింది వర్ణనల ద్వారా తెలుస్తుంది....
'ఉత్తముల ధర్మం ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడమే కదా!
ఓ మేఘుడా! నీ హృదయం నిండా ఆర్ద్రత ఉంది, సాధారణంగా ఇటువంటి వారు జాలి కలవారై ఉంటారు కదా!
అక్కడా ఇక్కడా విశ్రాంతి తీసుకుంటూ నా సంగతి మర్చిపోతావేమో మేఘుడా! పని చేసి పెడతామన్న మాట ఇచ్చిన వాళ్ళు ఆలస్యం చెయ్యరు
కదా!
ఓ మేఘుడా! నా ప్రేయసీ కనపడగానే, మొదట 'నీ భర్త క్షేమంగా ఉన్నాడు', అని చెప్పు. ముందుగా చెప్పవలసినది క్షేమ వార్తే కదా!
No comments:
Post a Comment