కృష్ణ నామం
కృష్ణ'నామం అత్యంత శక్తివంతమయినది . కోటి జన్మల పాపాలను సైతం హరించివేస్తుంది. ధర్మాచరణ దుర్లభామయిన ఈ కలి యుగంలో,
కేవలం ఒక్క దైవనామస్మరణ మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడింది. తన అవతారం చాలిస్తున్నప్పుడు, శ్రీ కృష్ణ పరమాత్మ తన
దివ్య తేజస్సును, శక్తులను శ్రీమద్భాగవతములో ప్రవేశింప చేసి," నేను ఈ భాగవతం లోనే నివసిస్తుంటాను. " అని అభయమిచ్చారు.
విష్ణు గాధా శ్రవణముచే పరీక్షిత్తు, కీర్తనచే శుకుడు, స్మరణచే ప్రహ్లాదుడు, పాద సేవచే లక్ష్మి దేవి, పూజలచే పృధు చక్రవర్తి, అభివందనముచే
అక్రూరుడు, దాస్యముచే హనుమంతుడు, సఖ్యముచే అర్జునుడు సర్వస్వమూ ఆత్మ సమర్పణము చేసి బలిచక్రవర్తి, ఈ నవ విధ భక్తులచే
క్రుతార్దులయినారు. శ్రీ కృష్ణ భక్తి అంత గొప్పది.
ఎన్నో పాపాలు చేసిన 'అజామిళుడు' చివరి క్షణం లో 'నారాయణా!' అని యధాలాపంగా తన కొడుకుని పిలచి, శాశ్వత వైకుంట ప్రాప్తి
పొందాడు. ఈ కధ 'భాగవతం' లోని షష్ఠ స్కందం లో ఉంది. 'ఎన్నో పాపాలు చేసిన యితడు వైకుంటానికి ఎలా వస్తాడు? పైగా యితడు
పిలచినది తన కొడుకునే గానీ, శ్రీమన్నారాయణుడిని కాదు!' అన్న యమ దూతలతో, విష్ణు దూతలు ఇలా అంటున్నారు. ఎంత చక్కటి
పద్యమో, చదవండి---
సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళన మేవవా |
వైకుంటనామగ్రహణం అశేషాఘహరం విదుహు ||
పతితః స్ఖలితః చిన్నహ సందశ్తః తప్త ఆహతః |
హరిరిత్యవశేనాహ పుమాన్ నార్హతి యాతనాం ||
తాత్పర్యము: పేరు పెట్టి పలికినా, పరిహాసంగా పలికినా, వెక్కిరిస్తూ హేళనగా పలికినా, ఊట పదంగా పలికినా, యే విధంగా అయినా
భాగావన్నామాన్ని ఉచ్చరిస్తే పాపాలన్నీ నిశ్శేషంగా నసిన్చిపోతాయి. పై నుండి పడినప్పుడు కాని, ఎముకలు విరిగినప్పుడు కాని, పాము,
తేలు లాంటివి కరచినప్పుడు కాని, వళ్ళు కాలినప్పుడు కాని, జ్వరతీవ్రతలో కాని, అమ్మ బాబోయ్ అని అరచే బదులు శ్రీహరీ, కేశవా, రామా,
నారాయణా వంటి భగవంనామాలను స్మరిస్తే, యాతనను అనుభవించవలసి ఉండదు. ఔషధము యొక్క గుణము తెలిసి వాడినా, తెలియక
వాడినా పని చేస్తుంది కదా!
మీ మనసుకి నచ్చిన దైవ నామాన్ని, గురు నామాన్ని స్మరించండి - తరించండి.
No comments:
Post a Comment