రోజూ పురుషుడు పొద్దుటే నిద్ర లేచి, నదిలో మునిగి కలశంలో నది నీళ్ళు తెచ్చి, పత్ని కాళ్ళు కడిగి , ఆ పాద తీర్ధం సేవించాలట...
ప్రతి దినంబును బురుషుండు పత్ని కంటె
ముందుగా లేచి నదిలోన మునిగి జలము
కలశమున దెచ్చి నిజపత్ని కాళ్ళు కడిగి
తానూ శ్రీ పాద తీర్థంబు త్రాగావలయు ||
కుష్టు రోగిణి అయినా, గుడ్డిదయినా, వికలాంగురాలయినా , ముసలిదయినా, ఆ పత్ని ఎంగిలి తిన్న పురుషుడు మాత్రమె పుణ్యలోకాలకు వెల్తాడట.
భార్యలు భర్తలను దండిస్తూ అదుపు ఆజ్ఞలలో పెట్టుకొవాలట . లేకపోతే భర్తలు గాడిదలై చేడిపోతారట .
పురుషుండు గార్ధభమున్
స్థిరముగా దండనము లేక చెడిపోదురిలన్
గరుణ దలంపక నెలకొక
పరియయినా గొట్టవలయాన్ని బత్ని పురుషునిన్ ||
వినడానికి మనకు ఇవన్నీ చాలా హాస్యంగా అనిపించినా , ఇవన్నీ ఆ నాడు స్త్రీకి విధించారని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆడ - మగ ఇద్దరిలో మగవాళ్ళు ఇప్పటికీ మన సమాజంలో కాస్త ఎక్కువ సమానమే!
No comments:
Post a Comment